'Waqf Amendment Bill 2024' before Lok Sabha today

నేడు లోక్‌సభ ముందుకు ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన ‘వక్ఫ్‌ సవరణ బిల్లు-2024’పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక సోమవారం లోక్‌సభ ముందుకు రాబోతున్నది. ఈ బిల్లులో 14 నిబంధనల్లో.. 25 సవరణలు చేశారు. మొత్తం 655 పేజీల బిల్లు ఉంది. దీన్ని జనవరి 30న లోక్‌సభ స్వీకర్‌కి జేపీసీ ఛైర్మన్ జగదాంబికా పాల్ ఇచ్చారు. అందువల్ల ఇవాళ కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఇక, జేపీసీకి చైర్మన్‌గా వ్యవహరించిన జగదంబికా పాల్‌, బీజేపీ ఎంపీ సంజయ్‌ తదితరులు ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. జేపీసీ ముందు ఇచ్చిన సాక్ష్యాల రికార్డ్‌ను కూడా సభలో వారు ప్రవేశపెట్టబోతున్నారు.

ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. ఈ జేపీసీలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు. అంటే.. ఈ బిల్లు పట్ల ప్రతిపక్షాలు కూడా అనుకూలంగా ఉన్నట్లే అని అనుకోవడానికి వీల్లేదు. నిజానికి జేపీసీలో.. ప్రతిపక్ష నేతలు.. 44 మార్పులను సూచించారు. వాటిని జేపీసీ ఛైర్మన్ ఒప్పుకోలేదు. అదే సమయంలో.. ఎన్టీయే పక్షాల సభ్యులు ప్రతిపాదించిన 14 సవరణలకు మాత్రం జేపీసీ ఆమోదం తెలిపింది. వీటికి ఎన్డీయేలోని 16 మంది సభ్యులు ఆమోదం తెలపగా.. విపక్షాలకు చెందిన 10 మంది ఎంపీలు వ్యతిరేకించారు. అందువల్ల ఈ బిల్లు లోక్‌సభకు వచ్చినప్పుడు.. రచ్చ రేగే అవకాశాలు ఉన్నాయి.

image

కాగా, జనవరి 29న, 655 పేజీల జేపీసీ నివేదికను మెజారిటీ సభ్యులు ఆమోదించారు. ఇందులో బీజేపీ సభ్యులు ఇచ్చిన సూచనలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలు సూచించిన సవరణలు తిరస్కరించబడ్డాయి. అంతకుముందు జేపీసీ సమావేశంలో, ముసాయిదా బిల్లు, సవరణలను మెజారిటీ సభ్యులు ఆమోదించారు. జేపీసీ సభ్యుల మధ్య ఓటింగ్ జరిగింది. సవరించిన బిల్లుకు అనుకూలంగా 16 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు ఈ ముసాయిదాతో తమ విభేదాలను వ్యక్తం చేసి, దీనిని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తుది నివేదికను అధ్యయనం చేయడానికి చాలా తక్కువ సమయం ఇచ్చారని పలువురు అన్నారు.

Related Posts
సుడాన్ యుద్ధానికి ఆయుధ సరఫరా ఆపాలని యూఎన్ పిలుపు
weapon

సుడాన్ లో ప్రస్తుత యుద్ధం మరింత తీవ్రమవుతోంది, రెండు ప్రధాన బలగాలు - సుడాన్ ఆర్మీ మరియు పారామిలిటరీ ఫోర్స్ (ఆల్-రాప్) - పరస్పర పోరాటం కొనసాగిస్తున్నాయి. Read more

మల్లన్నకు వారం రోజులు టైం ఇచ్చిన టీపీసీసీ
mlc teenmar mallanna1.jpg

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఒక కులాన్ని దూషించడం, కులగణన నివేదికను దహనం చేయడంపై పార్టీ Read more

India-Pakistan: పాక్ పై మండి పడ్డ భారత్
India-Pakistan: పాక్ పై మండి పడ్డ భారత్

భారత్ పై పాకిస్థాన్ కుట్రలు: అంతర్జాతీయ వేదికలో మరోసారి దెబ్బతిన్న దాయాది అంతర్జాతీయ వేదికలో భారత్ పై ఆరోపణలు చేసి తమ ఉనికి నిరూపించుకోవాలనుకున్న పాకిస్థాన్ కు Read more

బీఆర్ఎస్ హయాంలో అనేక రంగాల్లో వృద్ధి : కేటీఆర్‌
KTR

తాము దిగిపోయే నాటికి రాష్ట్రం తలసరి ఆదాయంలో నం.1గా హైదరాబాద్‌: కాళేశ్వరం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన నివేదికలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *