Visited the family members of the murdered student YCP MP YS Avinash Reddy

మాటల్లో చెప్పలేని అమానుషం ఇది : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

అమరావతి: కడప జిల్లా బద్వేల్‌లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను వైసీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలు కూడా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు.

Advertisements

ఈ సందర్భంగా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు.. మాటల్లో చెప్పలేని అమానుషం ఇది.. 2021లో ఇలాంటి సంఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశామని గుర్తుచేశారు. ఈ నాలుగు మాసాల్లో 74 సంఘటనలు జరిగాయి. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా..? అని మండిపడ్డారు. హోం మంత్రి అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్.. అలాంటి పాప చనిపోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొవాలి.. దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే పది నిమిషాల్లో స్పాట్ కి వెళ్ళేవారు.. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది.. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది.. సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోందని తెలిపారు.

Related Posts
డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత
డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత

అమరావతి : డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నిన్న రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు , నేరాల పట్ల హోం శాఖా కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన Read more

Satellite : చార్జీలతో టోల్ గేట్లకు గుడ్‌బై!
satellite

శాటిలైట్ టోల్ విధానం: వాహనదారులకు పెద్ద ఊరట! దేశంలోని వాహనదారులకు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడానికి కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్ని అమలు Read more

వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు
ఆండాళ్‌ అమ్మవారి

ఫిబ్ర‌వ‌రి 23న ఆండాళ్‌ అమ్మవారి స్వర్ణ రథోత్సవం. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శ‌నివారం రాత్రి 7 గంటలకు జరుగనున్న శ్రీవారి గరుడ సేవలో Read more

Chandrababu Naidu: టెక్ దిగ్గజాలతో చంద్రబాబు కీలక ఒప్పందం
Chandrababu Naidu: టెక్ దిగ్గజాలతో చంద్రబాబు కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. భవిష్యత్తు టెక్నాలజీలకు అత్యాధునికంగా నిలవనున్న “క్వాంటం వ్యాలీ” స్థాపన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు Read more

Advertisements
×