ఇకఈ కాలంలో యువతలో ఐఫోన్ (iPhone) పట్ల పిచ్చి పెరుగుతోందీ, దాన్ని పొందడం పెద్ద సామాజిక గుర్తింపు, స్టేటస్ లాంటి ఫీల్ ను ఇస్తుందనేది నిజం. కానీ ఈ ఆశ, కొన్నిసార్లు ప్రమాదకర పరిణామాలకు దారితీస్తోంది.ఇక యూత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లే.. కొందరై అప్పులు చేసి మరీ ఐఫోన్ కొంటుంటే మరి కొందరు.. ఇంట్లో వాళ్లను వేధించి, ఇప్పించక పోతే బ్లాక్ చనిపోతామని బ్లాక్ మెయిల్ చేసి మరీ దాన్ని సొంత చేసుకుంటున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే విశాఖ (Visakhapatnam) జిల్లాలో వెలుగు చూసింది. ఇంట్లో వాళ్లు ఐఫోన్ కొనివ్వలేదని ఒక యువకుడు ఏకంగా ప్రాణాలనే తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకొని బలవన్మరనానికి పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా పెందుర్తి సుజాతానగర్కు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తికి సాయి మారుతి అనే కుమారుడు ఉన్నాడు.

పూర్తి వివరాలు
తండ్రి స్టాక్ మార్కెట్ (Stock market) లో పెట్టుబడులు పెడుతూ జీవనం సాగించేవాడు. కొడుకు సాయి హైదరాబాద్లో ఉంటూ సినిమా పరిశ్రమలో పనిచేసేవాడు. అయితే సాయి ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికొచ్చినప్పటి నుంచి సాయి తనకు ఐఫోన్ ఇప్పించాలని తండ్రిని అడగడం స్టార్ట్ చేశాడు.ఈ విషయంపై తండ్రి కొడుకుల మధ్య గొడవలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఎంత అడిగినా ఇంట్లో వాళ్లు ఫోన్ ఇప్పించట్లేదని మనస్తాపంలో సాయి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
తన గదిలోకి వెళ్లి రూమ్ లాక్ చేసుకున్నాడు. సాయంత్రం అయినా సాయి రూమ్లోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పేరెంట్స్ తలుపు పగలగొట్టి చూశారు. ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిన కుమారుడిని చూసి షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: