రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు

TTD: రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు

TTD: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 6-11 గంటల వరకు ఆనంద నిలయం, బంగారు వాకిలి, ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా 25న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 24న ప్రొటోకాల్‌ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది.

Advertisements
రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు

అనంత‌రం భక్తులను దర్శనం

ఇక, ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల

కాగా, ఈ నెల(మార్చి) 25న కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం, 30వ తేదీన ఉగాది పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కారణంగా 24, 29వ తేదీల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం రేపటి(సోమవారం) నుంచి అమ‌లులోకి రానుందని టీటీడీ తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌డం జ‌రుగుతుందని పేర్కొంది.

Related Posts
నేడు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Hemant Soren took oath as Jharkhand CM today

రాంచీ: నేడు జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంగా అట్టహాసంగా జరగబోతోంది. జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం Read more

నేటి నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లు..
Teacher mlc nominations from today

హైదరాబాద్‌: వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలోని అభ్యర్థులు నల్లగొండలోనే నామినేషన్లు Read more

టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వాసిరెడ్డి పద్మ
టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వాసిరెడ్డి పద్మ

ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ త్వరలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆమె, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిని Read more

Entrance Exam : కామన్ ఎంట్రన్స్ పరీక్షల లీకేజీలు – విద్యార్థుల ఆత్మహత్యల కారణాలు
Entrance Exam : కామన్ ఎంట్రన్స్ పరీక్షల లీకేజీలు – విద్యార్థుల ఆత్మహత్యల కారణాలు

కామన్ ఎంట్రెన్స్ లీకేజీలు – ఒత్తిడి కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా జరుగుతున్న కామన్ ఎంట్రన్స్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన అంశం తీవ్రమైన సమస్యగా మారింది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×