విజయవాడ : రాష్ట్ర సచివాలయంలో భద్రతను ఎపి ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తోంది. ఆ క్రమంలొ ప్రవేశద్వారాల వద్ద నూతన సాంకేతిక వ్యవస్థ (Technical system) ను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పరికరాలు వచ్చాయి. ప్రవేశద్వారాల వద్ద వాటిని అమరుస్తున్నారు. అది పూర్తికాగానే సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది, పాత్రికేయు లకు స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. గుర్తింపు కార్డునకు అదనంగా ఇది ఉంటుంది. ప్లెయిన్గా ఉండే ఈ కార్డులోని చిప్లో మనకు సంబంధించిన అన్ని వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. దీన్ని స్కాన్ చేయగానే డేటాబేస్లో ఉన్న వివరాలతో సరి పోల్చు టకొని ఆటోమేటిక్గా తలుపులు తెరుచు కుంటాయి.

పూర్తికాగానే
బెంగుళూరుకు చెందిన ‘సత్యాలజీ’ (Satyology) అనే సంస్థకు ప్రభుత్వం ఈ భాధ్యతలు అప్పగించింది. వారం రోజుల్లో ఈ పనులు పూర్తి చేస్తామని సంస్థ ప్రతినిథులుతెలిపారు. వాహనాల్లోవచ్చే ఉద్యో గులు, సిబ్బందికి రేడియో ఫ్రీకెస్సీ గుర్తింపు (ఆర్ఎఫ్ఎడీ)ను ఇస్తారు. ఈ ఆర్ఎఫ్త స్టిక్కర్ను వాహనం ముందు అతికిస్తారు. దాన్ని ‘బూమ్ వారియర్’ (Boom Warrior) స్కాన్ చేస్తుంది. అనంతరమే గేట్లు తెరుచుకుంటాయి. ఫాస్ట్ ట్యాగ్ తరహాలో ఇది పని చేస్తుంది. ఇందుకు ఉద్యోగుల వాహనాల నెంబర్ లను ఓ డేటాబేస్లో నిక్షిప్తం చేయనున్నారు.
ఏపీ సచివాలయం అంటే ఏమిటి?
ఏపీ సచివాలయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యాలయ సముదాయం. ఇది ముఖ్యమంత్రి, మంత్రులు,ముఖ్యశాఖల అధికారుల కార్యాలయాల కేంద్రంగా ఉంటుంది. రాష్ట్ర పాలనకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, ఫైల్ ప్రాసెసింగ్, పరిపాలనా కార్యకలాపాలు ఇక్కడ నిర్వహించబడతాయి. ప్రస్తుతం ఏపీ సచివాలయం అమరావతిలో ఉంది.
సచివాలయంలో ఏవేవి శాఖలు పనిచేస్తాయి?
సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం సహా పలు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఉదాహరణకు: రెవెన్యూ, హోం, విద్య, ఆరోగ్య, పురపాలక, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖలు మొదలైనవి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Director Vikas Marmat: కుప్పంలో ప్రతిగ్రామానికి ఇ-ఆటోలు