
ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’లో ముగ్గురు హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని లూలూ మాల్లో సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు నిధి అగర్వాల్ (Nidhi Agarwal) తో పాటు మరో హీరోయిన్ రిధి కుమార్ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలోని ‘సహన సహన’ పాటను బుధవారం (డిసెంబర్ 17) విడుదల చేశారు.
Read Also: Raja Saab: ‘సహనా సహనా’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
ఈ ఘటనతో నిధి తీవ్ర ఆందోళనకు గురయ్యారు
కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. దీంతో తీవ్రమైన తోపులాట జరిగి, ఆమె కారు ఎక్కేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఈ ఘటనతో నిధి (Nidhi Agarwal) తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న బౌన్సర్లు ఎంతో కష్టపడి ఆమెను సురక్షితంగా కారు వద్దకు చేర్చారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సెలబ్రిటీల భద్రత, ఈవెంట్ నిర్వహణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీడియోలలో, జనసమూహం మధ్య నుంచి తన వాహనం వైపు వెళ్లేందుకు నిధి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు కారులోకి ఎక్కిన వెంటనే ఆమె ఊపిరి పీల్చుకుని “దేవుడా, ఏంటిది అసలు?” అని వ్యాఖ్యానించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: