బంగారం ధర పెరుగుతున్న వాస్తవం
బంగారం ధరకు పట్టభాగ్గాలు లేకుండా పోయాయి. రోజు రోజుకి ధరలు పెరుగుతూ అంచనాలను తారుమారు చేస్తుంది. ఒక పక్క ధరలు తగ్గుతాయని చెప్పేసి నిపుణలు చెప్తుంటే అందుకు భిన్నంగా రోజు రోజుకి అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ మూడు నెలల చూస్తే 15 సార్లు బంగారం ధర పెరిగిందంటే బంగారం ధర ఏ రేంజ్ లో పెరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు.
బంగారం ధర జీవితకాలపు గరిష్టానికి చేరుకున్నది
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా జీవితకాలపు గరిష్టానికి బంగారం ధర చేరుకుంది. లక్ష రూపాయలకి తులం బంగారం ధర దాదాపుగా దగ్గరగా చేరుకుంది. అక్షర తృతీయ మరో పక్షం రోజులో వ్యవధిలో ఉంది. అక్షర తృతీయ నాటికి లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని చెప్పేసి సర్వేలు వెలడుచేస్తున్నాయి.
నిపుణల అంచనాలు తారుమారు
అసలు వాస్తవానికి ఈ బంగారం ధర చాలా తగ్గుతుందని 60,000కు దిగుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ నెల రోజుల్లోనే అంచనాలన్నీ తారుమారు చేసింది. దీనిలో నిపుణలు కూడా ఆశ్చర్యపోతున్నారు. బంగారం ధర ఈ మేరకు ఏ విధంగా పెరుగుతుందన్న దాని మీద ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సంక్షోభ సమయంలో బంగారం ధరలు పెరుగుతాయి
ప్రధానంగా మనం చూసుకుంటే బంగారం ధర ఎప్పుడైతే సంక్షోభం ఉంటుందో సంక్షోభం ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతూ వస్తుంటాయి. ప్రస్తుతం చూసుకుంటే అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్నటువంటి సుంకాల యుద్ధం ఏదైతే ఉందో ఆ ప్రభావం స్పష్టంగా బంగారం మీద చూపిస్తుంది. అందుకే లక్ష రూపాయలకు చేరుగా చేరుకుంటుంది అని చెప్పేసి అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
బంగారం పెట్టుబడిగా మారడం
ఎప్పుడైతే ఒడిదలు ఉంటాయో షేర్లు తగ్గుతూ ఉంటాయో లేదంటే సుంకాల యుద్ధం జరుగుతుందో ఆ సమయంలో బంగారాన్ని స్థిరమైన పెట్టుబడిగా భావిస్తారు. ఒక పక్క బంగారం స్థిరమైన పెట్టుబడిగా ఉంటే మరో పక్క ఆభరణాలు కూడా కొనుగోలులో కూడా మహిళలు గాని భారతీయులు భారతీయ కుటుంబాలు ఆసక్తి చూపిస్తాయి. ప్రపంచంలో రెండు దేశాల్లోనే ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తున్నారు అందులో చైనా కాక రెండవది భారతదేశం.
భారతదేశంలో బంగారం నిల్వలు
భారతదేశంలో ఉన్నటువంటి పెరుగుదల మరి ఏ రాష్ట్రంలో కూడా మనకి కనిపించదు. అయితే బంగారం ఎక్కువగా నిల్వలు ఉన్న రాష్ట్రం చూసుకుంటే అమెరికాలో అత్యధిక స్థాయిలో నిల్వలు ఉంటే ఇండియాలో మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎనిమిదవ స్థానంలో ఉంది అయినప్పటికీ బంగారం ధర మాత్రం ఇక్కడ పెరుగుతూనే ఉంటుంది.
బంగారం ధర పెరుగుతున్న కారణాలు
ఈ బంగారం ధర పెరిగింది కాబట్టి నిపుణలు చాలా మంది చెప్పడం ఏంటంటే రేట్లు తగ్గుతాయి అన్నారు ఈ డిమాండ్ తగ్గుతుంది కాబట్టి అమ్మకాలు పడిపోతాయి అని చెప్పడం జరిగింది. అయితే గత రెండు నెలలో చూస్తే 5% పెరిగింది ఇది ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది.
రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ గతం
బంగారం ధర ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది కానీ ఏ రోజు కూడా తగ్గిన ప్రభావం కనిపించడం లేదు. గత సంవత్సరం చూసుకుంటే 25 సార్లు పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. సంవత్సరాంతం 25 సార్లు పెరిగితే ఈసారి కేవలం మూడు నెలలోనే 15 సార్లు పెరగడం అనేది మనం బంగారం ధర ఏ విధంగా పెరుగుతుందో ఒకసారి అంచనా వేయొచ్చు.
మరిన్ని అంచనాలు
ప్రస్తుతం అక్షర తృతీయ మరో 15 రోజులలో ఉంది. పక్ష రోజులు అక్షర తృతీయకి మళ్ళీ బంగారం కొనుగోలు ఉంటాయి. అయితే రేట్లు పెరిగాయి కాబట్టి ముందుగా భయం నిత్యం చేస్తున్నప్పటికి బంగారం కొనుగోలులో మాత్రం భారతీయ కుటుంబాలు ఏ మాత్రం వెనుకంచ వేయడం లేదు.
భారతీయ కుటుంబాల్లో బంగారం కొనుగోలు
గ్రాములు తులాల దగ్గర తేడా వచ్చినప్పటికి వాళ్ళు పెడతాన్న పెట్టుబడి ఏది ఉందో 10,000 కావచ్చు, లక్ష రూపాయలు కావచ్చు, ₹3 లక్షలు కావచ్చు ఆ అమౌంట్ లో ఎంత బంగారం వస్తే అంత బంగారం కొనడం అనేది ప్రస్తుతం కొనసాగుతుంది.
బంగారం కొనుగోలుకు కారణాలు
ప్రస్తుతం రెండు రకాల కారణాలు మనకి బంగారం పెరగడానికి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి అమెరికాలో ట్రంప్ చేస్తున్నటువంటి సుంకాల యుద్ధం ఒక పక్కన అయితే రెండో పక్కన బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేసి నిలువ చేసుకుంటున్నాయి.
బంగారం స్థిరమైన పెట్టుబడిగా
కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అనేక బ్యాంకులు ఆర్బిఐ కూడా చివరికి బంగారాన్ని కొనుగోలు చేసి సిద్ధం చేసుకుంటుంది. ఎందుకంటే వాతావరణం సరిగ్గా లేదు. షేర్ మార్కెట్లు చూస్తే అప్ అండ్ డౌన్ ఎక్కువగా ఉంటున్నాయి. భూమి రేట్లు కూడా పెద్దగా లేదు రియల్ ఎస్టేట్ దాదాపుగా దెబ్బ తినింది. ఇలాంటి సమయంలో స్థిరమైన పెట్టుబడి ఏదైనా ఉందంటే అది కేవలం బంగారంగా మాత్రమే కనిపిస్తుంది.
భద్రత కోల్పోతున్న పెట్టుబడులు
షేర్లు గాని, రియల్ ఎస్టేట్ గాని, ఎప్పుడైతే తగ్గుతుందో, తగ్గుముఖం పడ్డాయో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో భద్రత కోల్పోతున్నారు. అలాంటప్పుడు బంగారం వైపు రావడం జరుగుతుంది.
నమ్మకాలు స్థిరంగా కొనసాగుతున్నాయి
ప్రస్తుతం కూడా అదే నమ్మకం కొనుగోలు దారిలో గాని పెట్టుబడి దారిలో గాని వ్యాపారం వాణిజ్య వర్గాల్లో గాని బంగారం ధర తగ్గవు అన్న నమ్మకం కనిపిస్తుంది.
బంగారం ధరపై తాజా అంచనాలు
ఈ బంగారం ధర మరింత పెరిగి ఈ సంవత్సరం అంతానికి వచ్చేటప్పటికి తులం బంగారం ధర లక్షపాతికి వేలకు చేరుకునే అవకాశముందని చెప్పేసి అంచనాలు పెర్కొంటున్నాయి.