Vidala Rajini : రజినిపై ఏసీబీ కేసు నమోదు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. ఇటీవల మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆమె ఘాటుగా స్పందించారు. కూటమి ప్రభుత్వం తనపై కక్షసాధింపుకు పాల్పడుతోందని, నిరాధార ఆరోపణలతో కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు.ఇది నన్ను రాజకీయంగా అణచివేయడానికి జరుగుతున్న కుట్ర, అంటూ విరుచుకుపడ్డారు. బీసీ మహిళగా తాను ఎదుగుతుంటే, కొన్ని వర్గాలు తట్టుకోలేక కావాలని అక్రమ కేసులు పెడుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. న్యాయపోరాటం చేసి నిజాన్ని బయటపెడతాను, అని స్పష్టం చేశారు.2022 సెప్టెంబర్లో పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలంలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారంలో విడదల రజినిపై అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది.ఏసీబీ తనిఖీల పేరుతో రాజకీయ ఒత్తిళ్లకు దిగుతోంది,” అంటూ ఆమె ఆరోపించారు. నిజానికి, ఏమీ చట్ట విరుద్ధంగా చేయలేదని, ప్రభుత్వ పెద్దలు కావాలని తనను లక్ష్యంగా చేసుకున్నారని వాదించారు.ఈ కేసుపై విడదల రజిని తేల్చిచెప్పిన సంగతి ఏమిటంటే – నా రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. కానీ న్యాయపరంగా పోరాడి నా నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాను, అని ధైర్యంగా ప్రకటించారు.ఇదే సమయంలో ఆమె పార్టీ శ్రేణులు, అనుచరులు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. “ఈ కేసు రాజకీయం తప్ప, న్యాయం కాదు” అంటూ భగ్గుమంటున్నారు. ఏదైనా, ఈ వివాదం త్వరలో మరింత ముదురుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు!