Vaastu changes at Telangana Secretariat

తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు..

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు చేస్తున్నారు. సచివాలయానికి తూర్పు వైపున ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసివేస్తున్నారు. దాదాపు రూ.3 కోట్ల 20 లక్షల వ్యయంతో వాస్తు మార్పులు చేస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మార్పులో భాగంగా ప్రస్తుత ప్రధాన ద్వారం తలుపులు తీసేసి ఆ ప్రాంతంలో రేకులు ఉంచారు. ఈశాన్య గేటుకు తూర్పు వైపున ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ప్రధాన ద్వారం ఉన్న చోట మరో గేటును ఏర్పాటు చేస్తారు. సచివాలయంలోని మిగిలిన గేట్లను యథావిధిగా ఉంచనున్నారు. వచ్చే నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఆ లోపలే సచివాలయ వాస్తు మార్పులు పూర్తి చేసే పనుల్లో అధికారులు ఉన్నారు.

కాగా, తెలంగాణ సెక్రటేరియట్‌‌కు ప్రస్తుతం నాలుగు వైపులా ప్రధాన గేట్లు ఉన్నాయి. తూర్పు వైపు లుంబినీ పార్క్‌కు ఎదురుగా బాహుబలి గేటు ఉండేది. ఆ గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు ఉన్న మార్గంలోనే తెలంగాణ తల్లి విగ్రహం, దాని చుట్టూ లాన్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. అందుకే గత కొంతకాలంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇప్పుడు ఈ మార్గంలోనే నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డును నిర్మిస్తున్నారు.ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ అధికారులు ప్రస్తుతం ఈశాన్యం వైపున ఉన్న గేటును రాకపోకల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ గేటు పక్కనే మరో గేటును నిర్మించనున్నారు. ఒక గేటు నుంచి లోపలికి, మరో గేటు నుంచి బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు. తెలంగాణ సచివాలయాన్ని గత బీఆర్ఎస్ హయాంలో 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 2023 సంవత్సరం ఏప్రిల్ 30న దీన్ని కేసీఆర్ ప్రారంభించారు.

Related Posts
‘కల్తీ నెయ్యి’ ఆరోపణలపై విచారణ.. సిట్ అధికారులు వీరే
tirumala laddu ge

తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటయింది. ఈ సిట్ దర్యాప్తు కోసం Read more

కాంగ్రెస్‌కు రంజాన్ గిఫ్టు ఇదే – బండి సంజయ్
bandi sanjay revant

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు రెండు కీలక స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ Read more

బర్డ్‌ఫ్లూ..చికెన్, గుడ్లు తినొద్దని అధికారుల ఆదేశాలు
Bird flu.. Authorities orders not to eat chicken and eggs

అమరావతి: పలు ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన అధికారులు.బర్డ్‌ఫ్లూ చికెన్ గుడ్లు తినొద్దని అధికారుల ఆదేశాలు.ఉ.గో జిల్లాల్లో కల్లోలం సృష్టిస్తోన్న బర్డ్ ఫ్లూ కృష్ణా జిల్లాకూ Read more

లార్నూ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదుల హతం
Another encounter in Jammu and Kashmir 1

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. ఆపరేషన్‌లో భాగంగా అనంతనాగ్‌ లోని లార్నూ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు శనివారం నాడు మట్టుబెట్టాయి. అనంతనాగ్ ఆర్మీ జవాన్ Read more