हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

V. Srinivasa Rao: మామిడి రైతులను ఆదుకోండి -సిఎం చంద్రబాబుకు సిపిఎం లేఖ

Sharanya
V. Srinivasa Rao: మామిడి రైతులను ఆదుకోండి -సిఎం చంద్రబాబుకు సిపిఎం లేఖ

విజయవాడ: మామిడి రైతులను సంక్షోభం నుండి ఆదుకోడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు (V. Srinivasa Rao) ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ లేఖలో మామిడి రైతులకు (mango farmers) కిలో రూ.12లు చొప్పున ధర ఇవ్వాలని అందులో రూ.4లు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందని, మిగతా మొత్తం కిలోకు రూ.8లు మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు అందించాలని ప్రభుత్వం నుండి మీరు ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలు కాలేదు. మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు సిండికేట్గా ఏర్పడి కిలో రూ.4లకు మించి కొనడం లేదు.

కనీస ధర ప్రకటించాలి

మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు రైతులను నిలువునా ముంచుతున్నారు. కాబట్టి పరిశ్రమల గుత్తాధిపత్యం నుండి రైతుల్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ ఏజెన్సీల ద్వారా ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని కొనుగోలు చేయాలి. మీరిచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. కర్ణాటక రాష్ట్రం కేంద్రం నుండి మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (Intervention scheme) క్రింద కిలో రూ.16లు చొప్పున 2లక్షల 50 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. కేంద్రంలో మీకున్న పలుకుబడి ఉపయోగించి కిలో రూ.16లతో కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కనీసం 500 కోట్లు నిధులు రాబట్టి కర్నాటకలో మాదిరి మామిడి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాను.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని పరిశ్రమల ఖాతాల్లో కాకుండా నేరుగా రైతులకు ప్రత్యక్షంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మామిడి పంటకు ప్రధాన కేంద్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా. సుమారు లక్ష ఎకరాల వరకు రైతులు తోతాపురి రకం సాగు చేస్తున్న విషయం మీకు తెలుసు. ప్రత్యేకించి తోతాపురి (బెంగళూరు) రకం మామిడి పండిస్తున్న రైతులు గత నాలుగు సంవత్సరాలుగా నష్టంలో ఉన్నారు. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించడం వల్ల మామిడి పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. మామిడి ఉత్పత్తి పెరగటంతో మామిడి కొనుగోలు ధర కిలో రూ. 23లకే పరిమితం చేసి మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు సిండికేట్గా ఏర్పడి మామిడి రైతులను దోపిడీ చేసేందుకు పూనుకున్నారన్నారు .

మామిడి రైతుల కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రధాన చర్యలు?

  • తక్షణ మద్దతు ధర (MSP) ప్రకటించడం
  • కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం
  • రవాణా మరియు నిల్వ సదుపాయాల మెరుగుదల
  • ఎగుమతులకు ప్రోత్సాహం
  • పంట బీమా అమలు
  • రైతులకు నష్టపరిహారం

Read hindi news: hindi.vaartha.com

Read also: Tirumala: అభిప్రాయసేకరణతో తిరుమలలో మెరుగైన సేవలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870