ఉత్తరప్రదేశ్లో పాశవిక ఘటన: గొడవల నేపధ్యంలో భర్తపై భార్య తీరని ప్రతీకారం
ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య పెరిగిన అభిప్రాయ భేదాలు ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీయగలవో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. స్థానిక అస్మోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తున్న భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ అనంతరం, భర్తపై భార్య విచక్షణారహితంగా దాడి చేసి అతని జననేంద్రియాలను కోసి (Cut off the genitals) వేసింది. ఈ దారుణానికి దిగిన అనంతరం ఆమె ఇంట్లో ఉన్న యాసిడ్ తాగి (Drink acid) ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ హృదయవిదారక సంఘటన గ్రామంలో కలకలం రేపింది.
కుటుంబ కలహాలు.. కట్టిన బంధం చేజారి
వివరాల్లోకి వెళ్తే, సంభాల్ జిల్లా అస్మోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తున్న ఇద్దరి భార్యభర్తలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొన్నాళ్ల తర్వాత భర్తతో పాటు అత్తింటి వారు తనను మానసికంగా, కట్నం కోసం తరచూ హింసిస్తూ వేధిస్తున్నారని ఆ మహిళ ఆరోపించింది. ఆమె సోదరుడు కూడా ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది.
ఘర్షణ తీవ్ర రూపం దాల్చిన రోజు
ఇటీవల వీరి మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకున్నది. అప్పటివరకూ మనస్సుల మధ్య కలహాలుగా ఉన్నవి, ఆ రోజు శారీరక దాడికి దారి తీసింది. గొడవలతో విసిగిపోయిన భార్య, కోపంతో తన భర్తపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆమె భర్త జననేంద్రియాలు కోసివేయబడ్డాయి. రక్తస్రావం ఎక్కువగా జరిగి అతను అక్కడికక్కడే మూర్ఛించిపోయాడు. భర్తపై దాడి చేసిన కాసేపటికే భార్య ఇంట్లో ఉన్న యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది

సమయస్ఫూర్తితో ప్రాణాలు గలిచిన కుటుంబ సభ్యులు
ఈ ఘోర సంఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి, ఇద్దరినీ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భార్యభర్తలు ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. భర్త గాయాలు తీవ్రమైనవైనప్పటికీ, వైద్యులు అతని ప్రాణాలు కాపాడేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు. భార్య కూడా యాసిడ్ తాగిన కారణంగా తీవ్రమైన ఇన్నర్ బర్నింగ్కు గురైంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా అత్యంత సంక్లిష్టంగా ఉందని వైద్యులు తెలిపారు.
పోలీసుల స్పందన – కేసు నమోదు ఆలస్యం
ఇక ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. భర్తపై భార్య దాడి చేసిన దాడిని వారు నిర్ధారించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
Read also: Delhi: ఢిల్లీలో వర్షాలకు కూలిన పోలీస్ స్టేషన్.. ఎస్సై మృతి