US rejects 41% of student visa applications

F-1 visa: 41శాతం విద్యార్థి వీసాల దరఖాస్తులను తిరస్కరించిన అమెరికా

F-1 visa: విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలని చాలామంది ఆశిస్తుంటారు. అందులోనూ అమెరికాలో ఉన్నతవిద్య అభ్యసించేందుకు మరింత ఎక్కువ మక్కువ చూపుతుంటారు. అందుకే వివిధ దేశాల నుంచి ఏటా ఎంతోమంది విద్యార్థులు అగ్రరాజ్యానికి ఉన్నత చదువుల కోసం వెళ్తుంటారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ విద్యార్థి వీసాల (F-1 visas) సంఖ్యకు అమెరికా భారీగా కత్తెర వేస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) లో ఏకంగా 41 శాతం వీసా దరఖాస్తులను ఆమెరికా తిరస్కరించింది.

41శాతం విద్యార్థి వీసాల దరఖాస్తులను

ఎఫ్‌-1 వీసాల కోసం 6.79 లక్షల మంది దరఖాస్తు

అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌-1 వీసాల కోసం 6.79 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 2.79 లక్షల (దాదాపు 41 శాతం) దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షల (36 శాతం) దరఖాస్తులకు అధికారులు ఆమోదం తెలుపలేదు. ఇక 2013-14 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల మంది విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకోగా.. 1.73 లక్షల (23 శాతం) దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.

ఎఫ్‌-1 వీసాలు 38 శాతం తగ్గాయి

అయితే తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలను అమెరికా దేశాలవారీగా వెల్లడించలేదు. గత ఏడాది డిసెంబర్‌ 9 వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. 2024 సంవత్సరం తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు ఎఫ్‌-1 వీసాలు 38 శాతం తగ్గాయి. కొవిడ్‌ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ నెలవారీ నివేదికల డేటా ప్రకారం.. 2024 జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య 64 వేల మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్‌-1 వీసాలను జారీ చేశారు. అంతకుముందు 2023 ఇదే సమయంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉంది.

Related Posts
మళ్లీ లాక్డౌన్ రానుందా..? నిపుణుల హెచ్చరిక
hmpv china

చైనాలో మరోసారి కొత్త వైరస్ HMPV (హ్యూమన్ మెటాన్యుమో వైరస్) వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా శ్వాసకోశ సమస్యలు తీవ్రమవుతున్నాయని, ఈ కేసులు అక్కడి Read more

Kishan Reddy : త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభం: కిషన్‌రెడ్డి
Begumpet railway station to be inaugurated soon.. Kishan Reddy

Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి బేగంపేట రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైల్వేలో విప్లవాత్మక Read more

YCP Iftar Dinner : ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్
Jagan IFTAR

రంజాన్ పవిత్రమైన నెల సందర్భంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రత్యేక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందు విజయవాడ గురునానక్ కాలనీలోని Read more

రాహుల్ పై సభాహక్కుల ఉల్లంఘన
rahul gandhi

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్నీ ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీలు యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్బంగా రాష్ట్రపతి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *