UP government has announced compensation for the deceased

మృతులకు పరిహారం ప్రకటించిన యూపీ ప్రభుత్వం

ప్రయాగ్‌రాజ్‌: ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మహాకుంభ్‌ డీఐజీ వైభవ్‌కృష్ణ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను డీఐజీ మీడియాకు వెల్లడించారు. అర్ధరాత్రి 1-2 గంటల మధ్య ఒకట్రెండు చోట్ల తొక్కిసలాట జరిగిందని.. బారికేడ్లు ధ్వంసం కావడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. మృతుల్లో 25 మంది ఆచూకీ గుర్తించామని.. మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉందన్నారు. తొక్కిసలాట ఘటనలో 60 మంది గాయపడ్డారని డీఐజీ చెప్పారు. ఇవాళ కుంభమేళాకు వీఐపీలను ఎవరినీ అనుమతించలేదని వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొందని.. వివరాలకు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1920ను సంప్రదించాలని డీఐజీ సూచించారు.

మృతులకు ₹25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..

కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతులకు యూపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. జ్యుడిషియల్‌ కమిషన్‌ ఈ అంశాన్ని దర్యాప్తు చేసి.. నిర్ణీత కాల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే సీఎస్‌, డీజీపీ స్వయంగా ఒకసారి ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి ఆయా అంశాలను పరిశీలిస్తారని తెలిపారు.

image

కాగా, మౌని అమావాస్య కావడంతో బుధవారం మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. మౌని అమావాస్య రోజున అమృత స్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం, ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున భక్తులు గుమికూడటంతో కొందరు బారికేడ్లను బద్దలు కొట్టారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. మరోపక్క మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

Related Posts
ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో కీలక కేటాయింపులు – చంద్రబాబు స్పందన
ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో కీలక కేటాయింపులు – చంద్రబాబు స్పందన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రాల అభివృద్ధి కోసం పెద్ద కేటాయింపులు Read more

సీఎం ప్రోద్భలంతోనే దాడులు : ఎమ్మెల్సీ కవిత
Attacks at the instigation of CM Revanth Reddy: MLC Kavitha

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై NSUI, కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత ఖండించారు. కాంగ్రెస్ Read more

కోమాలో ఉన్న నీలం షిండే కుటుంబానికి అత్యవసర వీసా మంజూరు
కోమాలో ఉన్న నీలం షిండే కుటుంబానికి అత్యవసర వీసా మంజూరు

కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదానికి గురైన భారత విద్యార్థి నీలం షిండే ప్రస్తుతం కోమాలో ఉంది.ఆమె కుటుంబానికి అత్యవసర వీసా మంజూరు చేసి అమెరికా వెళ్లే అవకాశం కల్పించారు. Read more

Telangana CS : తెలంగాణ తదుపరి CSగా రామకృష్ణారావు?
ramakrishnarao

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (CS) కె. రామకృష్ణారావును నియమించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం ఈ ఏప్రిల్‌లో ముగియనున్న నేపథ్యంలో, కొత్త Read more