Two more cases of HMPV in India

భారత్‌లో మరో రెండు హెచ్‌ఎమ్‌పీవీ కేసులు

న్యూఢిల్లీ: చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు భారత్‌లోనూ క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు, అహ్మదాబాద్‌లో ఒకటి, చెన్నైలో మరో రెండు కేసులు వెలుగు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్‌ లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఏడు, 14 ఏళ్ల చిన్నారులకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్‌గా తేలింది.

image
image

జనవరి 3వ తేదీన చిన్నారులకు జ్వరం, దగ్గు రావడంతో నగరంలోని రాందాస్‌పేట్‌లో గల ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికీ హెచ్‌ఎమ్‌పీవీ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలకు ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం హెచ్‌ఎమ్‌పీవీ కేసుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ ఏడు పాజిటివ్‌ కేసుల్లో బాధితులంతా చిన్నారులే కావడం గమనార్హం. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

కాగా, హెచ్‌ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎదురుయ్యే వైద్యపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు సోమవారం మార్గదర్శకాలను జారీ చేశాయి. బెంగళూరులో రెండు హెచ్‌ఎంపీవీ కేసుల నేపథ్యంలో ‘ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం’ అంటూ కర్ణాటక అడ్వైజరీ జారీ చేసింది. జనం ఎక్కువ ఉన్న చోట్ల మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించింది. హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్‌ కాదని, దేశంలో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు అసాధారణంగా పెరగలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు వీడియో మెసేజ్‌ ద్వారా సూచించారు. కాగా, హెచ్‌ఎంపీవీతో పాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కొవిడ్‌-19 కేసులు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చైనా స్టేట్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది.

Related Posts
సైబరాబాద్ పరిధిలో రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే బాణాసంచా కాల్చుకోవాలి – సీపీ
diwali crackers

హైదరాబాద్‌లో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడంపై ప్రత్యేక ఆంక్షలు విధించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య Read more

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంచు మోహన్ బాబు, విష్ణు
mohanbabu cm

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు కలిసి సన్మానించారు. ముఖ్యమంత్రికి శాలువా కప్పి సత్కరించిన Read more

శబరిమలకు రావొద్దని అయ్యప్ప భక్తుడి విజ్ఞప్తి
Ayyappa's appeal to the dev

శబరిమల వైపు పయనమవుతున్న అయ్యప్ప భక్తులకు ఓ అయ్యప్ప భక్తుడు వీడియో సందేశం ద్వారా ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. కేరళలోని శబరిమలలో తుఫాన్ ప్రభావంతో విస్తృతంగా వర్షాలు Read more

Nirmala Sitharaman: ఆలయ ప్రసాదాల పై జీఎస్టీ మినహాయింపు: నిర్మలా సీతారామన్

ఆలయ ప్రసాదాలకు జీఎస్టీ మినహాయింపు: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన పార్లమెంటులో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆలయ ప్రసాదాలకు జీఎస్టీ Read more