Two cases registered against KTR

KTR: కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు

KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నల్గొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. పదో తరగతి పరీక్ష మాస్‌ కాపీయింగ్‌ ఘటనపై ఎక్స్‌ పోస్టులు ఫార్వర్డ్‌ చేశారని కేటీఆర్‌పై మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రజిత ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో ఏ1గా మన్నే క్రిశాంక్‌, ఏ2గా కేటీఆర్‌, ఏ3గా దిలీప్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఉగ్గడి శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా పెట్టిన పోస్టులు ఫార్వర్డ్‌ చేశారని ఎక్స్‌లో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదు చేశారు.

కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు

బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియాలో దుష్ప్రచారం

కాగా, తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌, మాస్‌ కాపీయింగ్ వ్యవహారంలో నిందితులతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ తమపై కేటీఆర్ ట్వీట్ చేశారని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రజిత తెలిపారు. దీనికి సంబంధించి బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ రజిత.. కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలో కేటీఆర్‌తో పాటు క్రిషాంక్, కొణతం దిలీప్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. నిందితుడు చిట్ల ఆకాష్ తన డ్రైవర్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో నకిరేకల్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా పేపర్ లీకేజీ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Related Posts
మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు పునఃప్రారంభం : ఇస్రో
Spadex experiments to resume from March 15.. ISRO

ఇప్పటికే రెండు ఉపగ్రహాలను విజయవంతం న్యూఢిల్లీ: జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇస్రో చీఫ్‌ వి. నారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన Read more

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యాల్లో బీజేపీ జోరు..
Delhi election results.. BJP strength in the lead

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 జిల్లాల్లోని 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి Read more

ప్రశాంత్ కిశోర్‌తో మంత్రి లోకేశ్ భేటీ..!
Minister Lokesh meet with Prashant Kishor.

న్యూఢిల్లీ: మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లారు. లోకేష్ కేంద్ర మంత్రిని కలవడానికి ముందుగానే లోకేష్ ను Read more

Caller ID : ఇంటర్‌నెట్‌వర్క్ కాలర్ ఐడీ సేవలు ఎప్పుడు?
Caller ID ఇంటర్‌నెట్‌వర్క్ కాలర్ ఐడీ సేవలు ఎప్పుడు

Caller ID : ఇంటర్‌నెట్‌వర్క్ కాలర్ ఐడీ సేవలు ఎప్పుడు? సెల్‌ఫోన్ వినియోగదారులకు త్వరలోనే స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టే ‘సీఎన్‌ఏపీ’ సేవలు అందుబాటులోకి రానున్నాయి. టెలికామ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *