ఆంధ్రప్రదేశ్లో మహిళల ప్రయాణానికి మరింత సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా, స్త్రీ శక్తి పథకాన్ని తిరుమల(tirumala) ఘాట్ రోడ్ దాకా విస్తరించారు. ఈ మార్గంలో ప్రయాణించే మహిళలకు ఇకపై ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం లభించనుంది. తిరుమల కొండపైకి వెళ్లే బస్సుల్లో కూడా ఉచిత రవాణా వర్తింపచేయడం ద్వారా వేలాది మంది భక్త మహిళలకు ఇది లాభదాయకంగా మారనుంది. అయితే, ఘాట్ రోడ్లో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, కేవలం సిటింగ్ సౌకర్యం కలిగిన బస్సుల్లో మాత్రమే ఈ సౌకర్యం వర్తించనుందని అధికారులు తెలిపారు.
చిరుద్యోగ మహిళలకు ఉపయోగం: బుద్ధప్రసాద్
స్త్రీ శక్తి పథకం ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా అద్భుత స్పందన లభిస్తోంది. పథకం అమలులో ఉన్న తొలి మూడు రోజుల్లోనే దాదాపు 43 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారు. రోజుకి సగటున సుమారు రూ.6.30 కోట్ల మేర ప్రయోజనం మహిళలకు అందుతోంది. ముఖ్యంగా ఆసుపత్రులు, (hospitals) పుణ్యక్షేత్రాలు లేదా చిరు ఉద్యోగాల నిమిత్తం ప్రయాణించే మహిళలు ఈ పథకం ద్వారా ప్రయాణ వ్యయాన్ని తగ్గించుకుని లాభం పొందుతున్నారు. ఇది మహిళల ఆర్థిక భద్రతకు ఒక వినూత్న ముందడుగు అని చెప్పొచ్చు.
ఈ పథకాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం స్మార్ట్ కార్డుల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. త్వరలోనే మహిళలకు క్యూఆర్ కోడ్తో(QR code) కూడిన ప్రత్యేక స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. ఈ కార్డుల ద్వారా వారు తరచుగా ప్రయాణించగలిగేలా చేస్తారు, మరియు గుర్తింపు కార్డులు చూపాల్సిన అవసరం లేకుండా ప్రయాణాన్ని సులభతరం చేయనున్నారు. ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాల ఆధారంగా ప్రయాణించడాన్ని క్రమంగా స్మార్ట్ కార్డులతో భర్తీ చేయనున్నారు.

త్వరలో QR కోడ్ లో కూడిన స్మార్ట్ కార్డ్స్
స్త్రీ శక్తి పథకం(Women Power Scheme) వల్ల రాష్ట్ర రవాణా సంస్థకు ఆదాయ నష్టమొచ్చినా, ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వం భరిస్తోంది. ఇది ఆర్టీసీ కార్యకలాపాలను ప్రభావితం చేయకుండా ఉచిత సేవలు అందించడానికి వీలుగా మారింది. ప్రస్తుతం ఈ పథకాన్ని రాష్ట్ర ఆంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో అమలు చేయాలా అనే అంశంపై కూడా సమీక్ష జరుగుతోంది. రాబోయే రోజులలో స్త్రీ శక్తి ప్రయోజనాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనుంది.
తిరుమల కొండపైకి వెళ్లే బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుందా?
అవును, తాజాగా తిరుమల ఘాట్ రోడ్పై కూడా ఈ పథకం విస్తరించబడింది. అయితే, ఘాట్ రోడ్ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండటంతో కేవలం సిటింగ్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు ఏ డాక్యుమెంట్లు అవసరం?
ప్రయాణ సమయంలో మహిళలు ఆధార్ కార్డు, ఓటర్ ID, లేదా రేషన్ కార్డు చూపించాలి. త్వరలో QR కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు కూడా జారీ చేయనున్నారు, తద్వారా ప్రయాణ మరింత సులభతరం అవుతుంది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :