TTD discrimination against Telangana public representatives is inappropriate.. Raghunandan Rao

Raghunandan : తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష తగదు: రఘునందన్ రావు

Raghunandan : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది వెళ్తుంటారు. దేశ విదేశాల నుంచి కూడా వెంకన్న దర్శనాకి భక్తులు వస్తారు. ఇక, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనానికి వెళ్తారు. కానీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించకపోవడం పెద్ద రచ్చగా మారింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం. టీటీడీ పాలక మండలి కూడా నిర్ణయం తీసుకున్నా.. ఇది అమల్లోకి రాకపోవడంపై తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అసహనం వ్యక్తం చేశారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పరిగణలోకి తీసుకుంటామని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.కానీ, ఇంత వరకు అమలు చేయలేదు.. ఉమ్మడి రాష్ర్టంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకున్న టీటీడీ ఇప్పుడు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

Raghunandan  తెలంగాణ ప్రజా ప్రతినిధుల

వేసవి సెలవులో సిఫార్సు లేఖలు

ఇక, సీఎం ఆదేశించినా.. పాలకమండలి నిర్ణయం తీసుకున్నా.. టీటీడీ అధికారులు ఎందుకు అమలు చేయడం లేదు అని రఘునందన్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష తగదన్న ఆయన పాలకమండలి అత్యవసర సమావేశమై నిర్ణయం అమలు చేయాలని సూచించారు. వేసవి సెలవులో సిఫార్సు లేఖలు ఇస్తాం.. పరిగణలోకి తీసుకోకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులం అందరం తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం అని వార్నింగ్‌ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు. మరోవైపు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకుంటామని టీటీడీ హామీ ఇచ్చింది. ఉమ్మడి రాష్ర్టం తరహలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు.

Related Posts
CM ChandraBabu Naidu: పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ పవన్ కు చంద్రబాబు అభినందనలు
CM ChandraBabu Naidu: పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు ఘనంగా జరుగుతున్నాయి. 2014లో పవన్ కళ్యాణ్ స్థాపించిన ఈ పార్టీ ప్రజాసేవ, స్వచ్ఛమైన రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. Read more

రేవంత్ మొస‌లి క‌న్నీరు – హరీష్
Government is fully responsible for this incident: Harish Rao

రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్రపట్టడం లేదని , స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా? అని ప్ర‌శ్నించారు. రుణమాఫీపై Read more

మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌ను ప్రారంభించిన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్
LIC Mutual Fund launched Multi Asset Allocation Fund

ముంబై : భారతదేశంలోని ప్రసిద్ధ ఫండ్ హౌస్‌లలో ఒకటైన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, డెట్ మరియు బంగారంలో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండ్ స్కీమ్ అయిన ఎల్ఐసి Read more

వీడియో తో నిజాలు బయటపెట్టిన టీడీపీ
vamshi satyadev

సత్యవర్ధన్‌ను వంశీ తన అనుచరులతో కలిసి కిడ్నాప్ వంశీ అక్రమ పనులకు చట్టపరంగా తగిన శిక్ష తప్పదు - మంత్రి కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీ (టీడీపీ) Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *