trump panama canal

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పనామా కెనాల్ విషయంలో కొంతమేరకు పంతం నెగ్గించుకున్నారు. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్ కు మధ్య ఒప్పందం కుదిరింది.తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్ నుంచి ప్రయాణించినపుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సే వెల్లడించారు. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా ప్రభుత్వ నౌకలకు దీని నుంచి భారీ మొత్తంలో నగదు మిగులుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో అక్రమ వలసదారులపై ఆ దేశం తీవ్రస్థాయి లో విరుచుకుపడుతోంది అభినందించారు.ఈ ఒప్పందం విషయాన్నీ అమెరికా విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది.

Advertisements
THUMBS.00 00 01 00.Still008

అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుంచి ఎటువంటి చార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు అని ఎక్స్ లో చేసిన పోస్ట్ లో పేర్కొంది .వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకొంది.ఈ విషయాన్నీ ఆదివారమే విదేశాంగ శాఖ మంత్రి రూబియో సూచాయగా వెల్లడించారు.నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నాటినుంచి ట్రంప్ పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఇందుకోసం సైనిక శక్తిని కూడా వాడే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ చిన్న దేశంలో ఆందోళన మొదలైంది.

Related Posts
పగ తీర్చుకుంటా: షేక్ హసీనా
Revenge: Former Prime Minister

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లను వదలబోనంటూ వార్నింగ్ ఇచ్చారు. చరిత్ర ఏదీ మర్చిపోదని తప్పక ప్రతీకారం Read more

Bank strike : బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
Bank employees strike postponed

Bank strike : సమస్యల పరిష్కారానికి ఈ నెల 24, 25 తేదీల్లో జరపతలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం Read more

Swimming : నలుగురి ప్రాణాలు తీసిన ఈత సరదా
Mahabubnagar : ఈతకు వెళ్లి ఐదుగురు మృతి

అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువు మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లేశ్ (36) తన ఇద్దరు పిల్లలు లావణ్య (12), నందకిశోర్ (10), అలాగే వారి Read more

Accident : వినుకొండ లో ఘోర రోడ్డు ప్రమాదం
vinukonda accident

పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)జరిగింది. బొలెరో ట్రాలీ వాహనం మరియు కొబ్బరికాయల లారీ ఒకదానికొకటి Read more

Advertisements
×