Trump comments are true: Vladimir Putin

ట్రంప్ వ్యాఖ్యలు నిజమే : వ్లాదిమిర్ పుతిన్

మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఉద్ఘాటించారు. ఈ మేరకు రష్యా అధికారిక టెలివిజన్‌ పుతిన్ మాట్లాడుతూ.. ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన స్మార్ట్‌ అంటూ ఆకాశానికెత్తేశారు. అంతేకాదు, 2020 అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ గనక విజయం సాధించి ఉంటే ఉక్రెయిన్‌తో యుద్ధం వచ్చుండేది కాదని వ్యాఖ్యానించారు. కానీ, అమెరికాతో సంప్రదింపులు విషయమై మాత్రం పుతిన్‌ స్పష్టతనివ్వలేదు. పుతిన్‌ను కలిసి మాట్లాడేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు ఇటీవల ట్రంప్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, వాషింగ్టన్‌ నుంచి పిలుపుకోసం తాను ఎదురుచూస్తున్నట్లు పుతిన్‌ అన్నారు.

కాగా, ఉక్రెయిన్ – రష్యా యుద్ధంపై ఎప్పుడు స్పందించినా ట్రంప్ ఒకమాట చెబుతూ వస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో కనుక తాను గెలిచి ఉంటే రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరగనిచ్చే వాడిని కాదని చెబుతున్నారు. తాజాగా పుతిన్ ఈ విషయం నిజమేనని, ట్రంప్ అందుకు సమర్థుడని ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌తో పొడసూపిన విభేదాలపై సంప్రదింపులు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

image

ఇకపోతే.. అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై ట్రంప్ స్పందించారు. సంఘర్షణ ముగించేలా పుతిన్ చర్చలకు రాకుంటే రష్యాపై మరిన్ని ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. యుద్ధాన్ని ఆపకుంటే రష్యాపై అధిక టారిఫ్‌లు, పన్నులు వడ్డిస్తామని, పలు ఆంక్షలు విధిస్తానని అని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్‌ స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇటీవల దావోస్‌ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులోనూ ఉక్రెయిన్‌ సంక్షోభంపై ట్రంప్ మాట్లాడారు. చమురు ధరలు తగ్గించాలని సౌదీ సహా ఒపెక్‌ (పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి)‌ను కోరతానని, ఒకవేళ వాటి ధరలు తగ్గితే అప్పుడు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగుస్తుందని అని ట్రంప్‌ అశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

Related Posts
సామ్‌సంగ్ షేర్లు 4 సంవత్సరాల కనిష్టానికి చేరాయి
samsung india gst investigation

సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు ఈ సంవత్సరం 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం, ఈ సంవత్సరం టీఎస్‌ఎమ్‌సీ (TSMC) మరియు ఎన్విడియా Read more

నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్ అరెస్టు
నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్ అరెస్టు

బీహార్‌లోని పాట్నాలో జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ను గాంధీ మైదానంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు Read more

‘ఎక్స్’ పై సైబర్ దాడి..ఉక్రెయిన్ ను నిందిస్తున్న మస్క్
స్టార్‌లింక్ ఎంట్రీ అంత ఈజీ కాదు..నిబంధనలు పాటించాలి

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ (ట్విట్టర్) సేవల్లో సోమవారం అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ యూజర్లు ఇబ్బందిని ఎదుర్కొన్నారు. సోమవారం ఒక్కరోజే మూడుసార్లు సేవలు Read more

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ – TS కు కేంద్రం సహకారం అందిస్తుందా?
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ - తెలంగాణకు కేంద్రం సహకారం అందిస్తుందా?

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ – తెలంగాణకు కేంద్రం సహకారం అందిస్తుందా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ Read more