TPCC chief Mahesh Kumar Zoom meeting with party leaders

పార్టీ నేతలతో టీపీసీసీ చీఫ్ జూమ్ మీటింగ్

మండల అధ్యక్షులకు దిశానిర్దేశం

హైదరాబాద్‌: రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 4 ఉమ్మడి జిల్లాల (ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ – కరీంనగర్) మండల అధ్యక్షులతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై మండల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు.

Advertisements
పార్టీ నేతలతో టీపీసీసీ చీఫ్

ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాల భర్తీ

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కేడర్‌ను సమాయత్తం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, భవిష్యత్‌లో ఖాళీగా ఉన్న మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందని వివరించాలని సూచించారు. విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పట్టభద్రుల్లో,ఉద్యోగ,ఉపాధ్యాయ వర్గాల్లో పార్టీ పట్ల నెలకొన్న సానుకూలతను తమకు అనుకూలంగా మల్చుకోవాలని స్పష్టంచేశారు.

మార్చి 20 న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు

కాగా, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 3 న నోటిఫికేషన్ వెలువడనుండగా, మార్చి 20 న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు ఉండనున్నాయి. అయితే ఇందులో ఏ పార్టీకి ఎన్ని దక్కే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్‌ హాసన్‌ల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. దీంతో ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.

Related Posts
Murder: భూమి కోసం మరదలిని చంపిన వదిన
Murder: భూమి కోసం మరదలిని చంపిన వదిన

ఆస్తి కోసం రక్త బంధానికి చెక్‌: నిజామాబాద్‌లో వదిన చేతిలో మరదలిని హత్య ఒకప్పుడు కుటుంబం అంటే ప్రేమ, ఆదరణ, సహాయం అనే భావనలు కనిపించేవి. కానీ Read more

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం: బండి సంజయ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులతో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమావేశం Read more

Hyderabad: ట్రాఫిక్ ఎస్సై పై వాహనదారుడి దాడి
Hyderabad: ట్రాఫిక్ ఎస్సై పై వాహనదారుడి దాడి

సికింద్రాబాద్‌లోని బోయినపల్లి వద్ద ట్రాఫిక్ ఎస్సైతో షోయబ్ అనే వాహనదారుడు వాగ్వాదానికి దిగాడు. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు షోయబ్ వాహనాన్ని ఆపారు. దీంతో ఆగ్రహించిన షోయబ్ Read more

అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతికి మోదీ నివాళి
atal bihari vajpayee

భారతదేశంలోని అగ్ర ప్రముఖ నాయకులలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రత్యేకమైన స్థానం కలిగిన వారిలో ఒకరని చెప్పవచ్చు. ఆయన 100వ జయంతి సందర్భంలో, ప్రస్తుత ప్రధాని నరేంద్ర Read more

×