हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Chandrababu : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పై టీపీసీసీ ఆగ్రహం

Sudheer
Chandrababu : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పై టీపీసీసీ ఆగ్రహం

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Jadcharla MLA Anirudh Reddy) చేసిన “తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు” అనే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇటీవలి బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలతో పాటు, చంద్రబాబు అనుచరులకు కాంట్రాక్టులు, కరెంట్, నీటి కనెక్షన్లు నిలిపివేయాలన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ శాసనసభాపక్షంతో పాటు టీపీసీసీలో చర్చనీయాంశంగా మారాయి.

టీపీసీసీ క్రమశిక్షణ చర్యలు

అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud ) తీవ్రంగా పరిగణించారు. పార్టీ క్రమశిక్షణా వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని భావించి, క్రమశిక్షణ కమిటీకి ఆయనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సోమవారం కమిటీ సమావేశం జరగనుండగా, అనంతరం అనిరుధ్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పరువు దెబ్బతినేలా మాట్లాడిన నేతలపై ఇకపై మినహాయింపు ఉండదని సంకేతాలు వెల్లువెత్తుతున్నాయి.

కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు

అనిరుధ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్టుపై రాజకీయ వాదనల నేపథ్యంలో ఈ తరహా ఆరోపణలు ప్రాజెక్టు అసలు ఉద్దేశాన్ని పక్కదారి పెట్టేలా మారుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసిన విధానం, అలాగే చంద్రబాబు కోవర్టుల ఆరోపణలతో ఇతర నేతలు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు టీపీసీసీ అనిరుధ్‌పై తీసుకోనున్న నిర్ణయం, రాష్ట్ర కాంగ్రెస్ దిశను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది.

Read Also : Chandrababu : వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్లు – చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870