పర్యాటక రంగంలో కనీసం 20 శాతం వృద్ధి
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త దిశగా ముందడుగు వేయాలని సీఎం చంద్రబాబు అధికారులు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయమని ఆదేశించారు. ఈ ప్రణాళికలో పర్యాటక రంగంలో కనీసం 20 శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి తెలిపిన ఆదేశం ప్రకారం, పర్యాటక రంగాన్ని మెరుగుపరచడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ సృష్టికి కీలకమని భావిస్తున్నారు. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా సమగ్ర ప్రణాళికను అమలు చేయడం కీలకమని ఆయన సూచించారు.

మెగా ప్రాజెక్టుగా శ్రీశైలం అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకోవాలని, దీనివల్ల పర్యాటక హబ్లను, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాలను సృష్టించవచ్చని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటకులకు మరింత ఆకర్షణీయమైన అనుభవం అందించేందుకు ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోంది. తిరుపతి, విశాఖ, అమరావతి, రాజమండ్రి వంటి ప్రధాన నగరాలలో ప్రత్యేకంగా టూరిజం హబ్లు ఏర్పరచాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ హబ్ల ద్వారా పర్యాటకుల కోసం ఆధునిక సదుపాయాలు, సేవలు అందించి, పర్యాటక రంగంలో నూతన ఎత్తులకు చేర్చేందుకు ఉద్దేశం.
అంతేకాకుండా, బీచ్ పర్యాటక మరియు క్రూయిజ్ పర్యాటకాన్ని ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీసుకునే ఈ చర్యలు, 20 శాతం వృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించనుండటం అనిపిస్తుంది.