ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమిని ఎదుర్కోవడానికి ఇరాన్ కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంలో ఉన్న అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిసైల్ రాడార్ వ్యవస్థపై ఇరాన్ దాడి చేసింది. తక్కువ ఖర్చుతో కూడిన షహీద్ డ్రోన్లను ఉపయోగించి, సుమారు 1.1 బిలియన్ డాలర్ల విలువైన సాంకేతికతను ఇరాన్ దెబ్బతీసింది. ఈ దాడి వల్ల అమెరికాకు మన కరెన్సీలో దాదాపు పది వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు సైతం ఈ విధ్వంసాన్ని స్పష్టంగా ధృవీకరిస్తున్నాయి.
Read also: Iran: చర్చల ప్రసక్తే లేదు.. సుదీర్ఘ యుద్ధమే

Iran attack deals irreparable blow to America
అగ్రరాజ్యానికి పోయిన కంటిచూపు
ఈ దాడిలో దెబ్బతిన్న AN/FPS-132 రాడార్ వ్యవస్థను అమెరికా సైన్యానికి ‘కంటిచూపు’గా పరిగణిస్తారు. ఇది సుమారు 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల కదలికలను ముందే గుర్తించగలదు. ఇరాన్ సిరియా వంటి దేశాల నుంచి వచ్చే క్షిపణులను పసిగట్టి, వాటిని గాలిలోనే అడ్డుకోవడానికి ఇది కీలక సమాచారాన్ని అందిస్తుంది. ఇప్పుడు ఈ వ్యవస్థ పని చేయకపోవడం వల్ల మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా బలగాలకు ముందస్తు హెచ్చరికలు అందడం కష్టతరం కానుంది. రాడార్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల అమెరికా రక్షణ నెట్వర్క్ కొంతవరకు ‘గుడ్డిగా’ మారినట్లు మాజీ సైనిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధతంత్రంలో ఇరాన్ మాస్టర్ ప్లాన్
ఇరాన్ తన దగ్గర ఉన్న పరిమిత వనరులతోనే అగ్రరాజ్యం అమెరికాను ఇబ్బందుల్లోకి నెడుతోంది. భారీ క్షిపణుల కంటే తక్కువ ధరకు లభించే ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించి, శత్రువుల ఖరీదైన ఆయుధ సంపత్తిని నాశనం చేస్తోంది. ఈ రాడార్ వ్యవస్థ థాడ్ మరియు పాట్రియాట్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలతో అనుసంధానించబడి ఉంటుంది. ఇప్పుడు ప్రధాన రాడార్ దెబ్బతినడం వల్ల ఈ రక్షణ వ్యవస్థల పనితీరుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో తమ వ్యూహాత్మక స్థానాన్ని కాపాడుకోవడానికి ఇరాన్ చేస్తున్న ఇటువంటి దాడులు అమెరికాకు పెద్ద సవాలుగా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: