Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్పై విరుచుకుపడ్డారు. పరామర్శల పేరుతో జగన్ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గంజాయి బ్యాచ్తో కలిసి ఇలాంటి యాత్రలు చేయడం సిగ్గుచేటని ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించారు.
Read also: Khamenei Death: ఖమేనీ హత్యపై మోదీ మాట్లాడాలని రాహుల్ గాంధీ డిమాండ్

Babu is angry over Jagan’s consultations
అంబులెన్స్ల నిలిపివేతపై సెటైర్లు
వైసీపీ శ్రేణుల హడావుడి వల్ల రోడ్లపై అంబులెన్స్లు సైతం నిలిచిపోతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వారి వాహనాల టైర్ల కింద పడి మనుషులు చనిపోతుంటే, ఆ నిందను ప్రభుత్వంపై వేయడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. తప్పు చేసిన వారే మళ్ళీ బాధితులను పరామర్శించడానికి వెళ్లడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
వైసీపీ డ్రామాలకు చెక్ పెడతాం
జగన్ చేస్తున్నవన్నీ రాజకీయ డ్రామాలేనని, ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని చంద్రబాబు హెచ్చరించారు. పోస్టుమార్టం అవసరమయ్యే పరిస్థితులు కల్పించిన వారే, ఇప్పుడు పరామర్శల పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: