Odisha Crime: రెండు బస్సుల మధ్య నలిగిన ఆటో.. వీడియో ఇదిగో!

Read Time:  1 min
An auto-rickshaw crushed between two buses
An auto-rickshaw crushed between two buses
FONT SIZE
GET APP

Odisha Crime: ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నగరంలో ఈ నెల 3వ తేదీన చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఒక స్కూల్ బస్సు వెనుక ఆటో నిలిచిఉండగా, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. రెప్పపాటులోనే ఆటో రెండు బస్సుల మధ్య ఇరుక్కొని పూర్తిగా నలిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read also: Hyderabad crime: ప్రియురాలి మృతి .. ప్రియుడు ఆత్మహత్య

Odisha Crime: ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా, అప్పటికే ప్రాణనష్టం సంభవించింది. ట్రాఫిక్ నియమాల నిర్లక్ష్యం, డ్రైవర్ అప్రమత్తత లోపమే ఈ విషాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో భారీ వాహనాల నియంత్రణపై అధికారుల పర్యవేక్షణ మరింత పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.