సచివాలయం : రాజమహేంద్రవరం ఘటన నేపధ్యంలో పాలు, పాల పదార్ధాల్లో కల్తీని ఇంట్లోనే సులువుగా గుర్తించవచ్చని రాష్ట్ర ఆహార భద్రత శాఖ వెల్లడించింది. ఫుడ్ అండ్ సేప్టీ డైరెక్టర్ నీలకంఠారెడ్డి తెలిపారు. ఏటవాలుగా పళ్ళాన్ని ఉంచి పాల చుక్కను వదలినప్పుడు స్వచ్చమైన పాలు అయితే తెల్లటి ధార మాదిరిగాదిగుతుంది. అదే నీరు కలిపిన పాలయితే తెల్లటి దార లేకుండా త్వరగా కిందికి దిగిపోతుందని రాష్ట్ర ఆహార భద్రత శాఖ తెలిపింది. ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా కల్తీపాలు, వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండవచ్చని పేర్కొంది.

AP Milk Adulteration: To detect milk adulteration..
రాజమహేంద్రవరం ఘటన నేపధ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షించారు. ఈ తాజాగా సందర్బంగా మంత్రి ఆదేశించిన ప్రకారం కల్తీపాలను ఎలా గుర్తించాలి అన్న దానిపై ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ నీలకంఠారెడ్డి ఓ ప్రకటన జారీ చేశారు. ఫుడ్ సేప్లీ ఆధార్టీ వారు పాలు, పాల ఉత్పత్తుల్లో జరిగే కల్తీని ఎలా కనుగొనాలో తెలియజేస్తూ పేర్కొన్న అంశాలను కరపత్రాలు, పుస్తకాల రూపంలో ప్రచురించి విద్యాసంస్థలకు పంపిణీ చేయబోతున్నట్లు ఐపిఎం డైరెక్టర్ నీలకంఠారెడ్డి తెలిపారు. వీటి ద్వారా ముఖ్యకూడళ్ళలోనూ, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: