నూజివీడులో అశోక్ లైలాండ్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి లోకేష్
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం నూజివీడు మండలం సీతారాంపురం రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మల్లవల్లి పారిశ్రామిక కేంద్రంలో అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నారా లోకేష్ కి నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు మండలం, మర్రిబంధం, సీతారాంపురం (పోలవరం కాలువ) బ్రిడ్జి దగ్గర ఘన స్వాగతం పలుకుటకు నూజివీడు నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రతి ఒక్కరు 4 గంటలకల్లా రావాల్సిందిగా రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు.
లోకేష్ తో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ
ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ నూజివీడు మరియు గన్నవరం నియోజకవర్గం నుండి నాయకులు భారీ ఎత్తున హాజరుకానున్నారు. వారు నూజివీడు పరిసర ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి లోకేష్ తో చర్చించనున్నారు.