బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ఐటీ క్యాంపస్లో (Basara Triple IT Campus) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల జాబితా శుక్రవారం విడుదల కానుంది. ఈ జాబితాను యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ (Chancellor Professor Goverdhan) అధికారికంగా రిలీజ్ చేయనున్నారు.ఈసారి ట్రిపుల్ఐటీ ప్రవేశాలకు విద్యార్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 20,258 మంది విద్యార్థులు అప్లై చేశారు. ఇది గతేడాది కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ డిమాండ్ ట్రిపుల్ఐటీ పట్ల విద్యార్థుల్లో ఉన్న ఆకర్షణ స్పష్టంగా తెలుస్తోంది.ప్రస్తుతం బాసర క్యాంపస్లో 1,500 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది మొదటిసారిగా మహబూబ్నగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంపస్ ద్వారా 180 సీట్లు కలిపి మొత్తం 1,680 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ రెండింటి కలిపిన కోటాతో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.

పదో తరగతి మార్కులకే ప్రధాన ప్రాధాన్యం
విద్యార్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే ప్రవేశాలకు ఎంపిక చేస్తారు. మెరిట్ ప్రాతిపదికన ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా జాబితా రూపొందించబడింది. దీంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్గా మారింది.
వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ చూడండి
ఎంపికైన అభ్యర్థుల జాబితా సహా ఇతర సమాచారం కోసం అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ www.rgukt.ac.in ను సందర్శించవచ్చు. పూర్తి వివరాలు అక్కడ పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.
Read Also : Liquor Dump Case : కాకాణి గోవర్ధన్రెడ్డికి మరో షాక్