Tirupati incident తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ భారీ డబ్బు డిమాండ్

Tirupati incident : తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ : భారీ డబ్బు డిమాండ్

Tirupati incident : తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ : భారీ డబ్బు డిమాండ్ తిరుపతిలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ చేసి, భారీగా డబ్బు డిమాండ్ చేశారు. వారి కుట్రను భగ్నం చేసేందుకు రాజేష్ అనే వ్యక్తి చేసిన ప్రయత్నం హృదయ విదారకంగా మారింది.శుక్రవారం సాయంత్రం తిరుపతి జీవకోన ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజేష్ కుటుంబ సభ్యులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అంతటితో ఆగకుండా కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించారు. మిగతా కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి రాజేష్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు.చిత్తూరులో ఉన్న బంధువుల దగ్గరికి వెళ్లి డబ్బు తెస్తానని రాజేష్ నమ్మబలికాడు. దుండగులు అంగీకరించడంతో, అతనిని కూడా వెంట తీసుకెళ్లారు. అయితే, ప్రయాణం మద్యలో ఐతే పల్లె వద్ద కారులో నుంచి రాజేష్ బలవంతంగా దూకేశాడు. ఈ ఘటనతో తీవ్ర గాయాలపాలైన రాజేష్ అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయాడు.బహిరంగ రహదారిపై గాయాలతో ఉండగానే, అక్కడి స్థానికులు అతన్ని గమనించారు.

Tirupati incident తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ భారీ డబ్బు డిమాండ్
Tirupati incident తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ భారీ డబ్బు డిమాండ్

వెంటనే 100 నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.తక్షణమే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాజేష్‌ను ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులను దుండగులు కిడ్నాప్ చేశారని, తాను తప్పించుకున్నానని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.గాయాలు తీవ్రంగా ఉండటంతో పోలీసులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా రాజేష్‌ను తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. “నా భార్య, పిల్లలను కాపాడండి” అంటూ వేడుకున్నాడు.ఈ విషయం తెలుసుకున్న అలిపిరి పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన కుటుంబ సభ్యుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే పూర్తి వివరాలు వెలుగు చూడనున్నాయి.

Related Posts
వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు
Another case registered against Vallabhaneni Vamsi

పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకాలు, దందాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు భయపడి గత Read more

కేంద్రం గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల
Central Government has released huge funds to the Telugu States

తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయింపులు చేసింది. ఏపీకి 498 కోట్లు,తెలంగాణకి 516 కోట్ల నిధులు విడుదల Read more

పిల్లలకు సాయం చేస్తా అంటూ మంచు విష్ణు
పిల్లలకు సాయం చేస్తా అంటూ మంచు విష్ణు

టాలీవుడ్ కథానాయకుడు, మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా సైనికుల త్యాగాలను గౌరవించే క్రమంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ Read more

అమెజాన్ లో గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ వ్యాఖ్యలు
pawan amazon

అమెజాన్ లో గిఫ్ట్ కార్డుల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గిఫ్ట్ కార్డులలో డబ్బు జమ చేయడం చాలా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *