Tirumala Stampede

తిరుమలలో విషాదం.. తొక్కిసలాటలో నలుగురు మృతి

తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) భక్తులకు ప్రత్యేక దర్శన టోకెన్లు జారీ చేస్తోంది. ఈ నెల 10న ప్రారంభమైన టోకెన్ల ప్రక్రియకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా టీటీడీ కేటాయించిన కేంద్రాల వద్ద ఉదయం నుండి భక్తులు భారీగా గుమిగూడడం ప్రారంభమైంది. ఈ క్రమంలో తిరుపతి బస్టాండ్ సమీపంలోని విష్ణు నివాసం వద్ద తోపులాట జరుగగా..నలుగురు భక్తులు మృతి చెందారు.

తమిళనాడుకు చెందిన మల్లిక అనే మహిళ ఈ తొక్కిసలాటలో తీవ్ర అస్వస్థతకు గురైంది. టీటీడీ సిబ్బంది వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మల్లిక మృతితో పాటు మరో నలుగురు భక్తులు కూడా మృతి చెందినట్లు సమాచారం. అలాగే పలువురికి తీవ్ర గాయాలు కావడం తో వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని టీటీడీ ముందుగానే ప్రకటించినప్పటికీ, టోకెన్ల కోసం భారీగా గుమిగూడిన భక్తులను సమర్థవంతంగా నియంత్రించడంలో విఫలమయ్యారు. తగిన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఘటన స్థలాలకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్దకు అదనపు పోలీసు బలగాలను తరలించారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు టీడీపీ కల్పించనున్నది. కల్పించనున్నది. ఈ నెల 9న తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లోని కౌంటర్లలో ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించింది. ఉదయం 5 గంటల నుంచి టికెట్లు జారీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం తరలివచ్చారు. దాంతో భక్తులు రోడ్లపై గుమిగూడకుండా పార్కులో సిబ్బంది వారిని ఉంచారు. భక్తులను పద్మావతి పార్క్‌ నుంచి క్యూలైన్లలోకి వదిలే సమయంలో తొక్కిసలాట జరిగినట్లు సాక్షులు చెపుతున్నారు.

Related Posts
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో స్వామి ఆలయాలు: టీటీడీ
TTD-has-decided-to-build-temples-of-Lord-Venkateswara-in-all-the-state-capitals-of-the-country

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల వేంకటేశ్వరుడి ప్రాముఖ్యతను మరింతగా పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో Read more

కర్ణాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు
Power struggle in Karnataka Congress

డీకే శివకుమార్‌ ‘పవర్‌’ను తగ్గించే ముమ్మర ప్రయత్నాలు బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. సీఎం పదవిని డీకే శివకుమార్‌కు అందకుండా చేయడానికి సీఎం Read more

చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు ట్రస్ట్ గొప్ప శుభవార్త
చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు ట్రస్ట్ గొప్ప శుభవార్త

చార్‌ధామ్ యాత్ర మార్గంలో అన్ని పనులు ఏప్రిల్ 15 నాటికి పూర్తవాలని ప్రజా పనుల శాఖ మంత్రి పాండే ఆదేశించారు ఈసారి యాత్ర మార్గంలో ప్రతి 10 Read more

రేపటి నుంచి మహా కుంభ ప్రారంభం..మొదటి రాజ స్నానం

ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభ మేళా కోసం వేచి ఉన్న వేళలో, జనవరి 13వ తేదీన మహాకుంభం ప్రారంభమవనుంది. ఈ జాతర 12 సంవత్సరాల తర్వాత జరుగుతుంది, అప్పుడు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *