Tirumala: ఏడుకొండల వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తి మలయప్పస్వామికి ఈ నెలలో రెండవసారి 29వతేదీ గరుడపంచమి సందర్భంగా గరుడసేవ జరగనుంది. సాధారణంగా ప్రతినెలాలో పౌర్ణమి రోజు గరుడసేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెలలో 10వతేదీ పౌర్ణమిరోజు గరుడసేవను భక్తులు వీక్షించారు. మళ్ళీ 29వతేదీ మంగళవారం గరుడపంచమి (Garuda Panchami) పురస్కరించుకుని ఆ రోజు సాయంత్రం 7గంటలకు మలయప్ప స్వామి (Malayappa Swamy) విశేషఅలంకారభూషితుడైన తరువాత గరుడవాహనంపై కొలువుదీరి ఆలయ మాఢవీ ధుల్లో ఊరేగుతారు. ప్రతి ఏడాది తిరుమలలో (Tirumala) గరుడపంచమిని వేడుకగా జరిపిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందా యకంగా ఉండాలని, తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వంతో ఉండాలని పూజ చేస్తారు.
తిరుమల వెనుక కథ ఏమిటి?
ద్వాపర యుగంలో, ఆదిశేషుడు వాయువుతో పోటీలో ఓడిపోయిన తర్వాత శేషాచలం కొండలుగా భూమిపై నివసించాడు. పురాణాల ప్రకారం తిరుమలను ఆదివరాహ క్షేత్రంగా పరిగణిస్తారు. హిరణ్యాక్షుడిని సంహరించిన తరువాత, ఆదివరాహుడు ఈ కొండపై నివసించాడు. వెంకటాచల మహత్యం తిరుమల ఆలయంపై విస్తృతంగా ఆమోదించబడిన పురాణం.
తిరుమలను 12 సంవత్సరాలు ఎందుకు మూసివేశారు?
12 మందిని ఉరితీసి చంపారు, మరియు వారి మృతదేహాలు తిరుపతి ఆలయ గోడలపై వేలాడదీయబడ్డాయి. ఆ సమయంలో దేవత కనిపించిందని మరియు తరువాత ఆలయం 12 సంవత్సరాలు మూసివేయబడిందని చాలా మంది చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Tirumala: రూ.44లక్షలు విరాళమిస్తే దాతపేరున అన్నప్రసాదాలు వడ్డింపు