Tirumala: మొదటిఘాట్లో ఎలుగుబంటి హల్చల్

Read Time:  1 min
Tirumala: మొదటిఘాట్లో ఎలుగుబంటి హల్చల్
FONT SIZE
GET APP

తిరుమల (Tirumala) నుండి తిరుపతికి దిగే మొదటిఘాట్లో ఆదివారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఎలుగు బంటి సంచారంతో భక్తులు భయపడ్డారు. వినాయకుని గుడి దాటిన తరువాత అటవీప్రాం తంలోనుండి ఎలుగేబంటి (Bear) ఘాట్రోడ్డు పైకి చేరింది. ఆ సమయంలో (Tirumala) తిరుపతికి దిగుతున్న వాహనదారులు గమనించారు. వాహనాల లైటింగ్కు, శబ్దాలకు ఎలుగుబంటి మళ్ళీ అడవిలోకి వెళ్ళింది. అయితే ఘాట్లో ఎలుగు బంటి సంచారంతో ఇప్పుడు భక్తులు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. మూడేళ్ళక్రిందట తిరుమలలోనే ఎలుగుబంటి సంచారం ఉం డేది. అంతేగాక శ్రీవారిమెట్టు మార్గంలోనూ ఎలుగుబంటి భక్తులకు కనిపించింది. అప్పట్లోనే పట్టివేతకు బోన్లు ఏర్పాటుచేశారు. రెండేళ్ళుగా ఎలుగుబంట్ల సంచారం లేదు. ఆదివారం రాత్రి మళ్ళీ మొదటిఘాట్లో ఎలుగుబంటి సంచరిం చడంతో భక్తుల్లో భయం పట్టుకుంది.

తిరుమల పాత పేరు ఏమిటి?

తిరుమల పాత పేరు వెంగడం లేదా తిరువెంగడమ్. ఆలయం ఉన్న కొండను వెంగడం కొండలు అని కూడా పిలుస్తారు. అదనంగా, 13వ శతాబ్దపు ఆచార్య-హృదయంలో తిరుమలను పుష్ప-మండపం అని పిలుస్తారు.

తిరుమల యజమాని ఎవరు?

తిరుమల వెంకటేశ్వర ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) యాజమాన్యంలో ఉంది మరియు నిర్వహించబడుతుంది. TTD అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే ఒక స్వతంత్ర ట్రస్ట్. TTD అధిపతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Tirumala: 29న మలివిడత గరుడసేవ

Ramya

రచయిత గురించి

Ramya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.