हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

ఏపీ ఫైబర్‌నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు పడింది

Uday Kumar
ఏపీ ఫైబర్‌నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు పడింది

ఉన్నతాధికారుల తొలగింపు – ఫైబర్‌నెట్‌లో మార్పులు

ఏపీ ఫైబర్‌నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారుల పై వేటు పడింది. ఫైబర్‌నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌ భరద్వాజ, ఫైబర్‌నెట్ బిజినెస్ హెడ్ సురేశ్‌, ప్రొక్యూర్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఫైబర్‌నెట్ ఛైర్మన్‌ జీవీ రెడ్డి ఆదేశాలిచ్చారు. గత 9 నెలలుగా ఫైబర్‌నెట్‌లో కనీస పురోగతి లేదని ఒక్క రూపాయి ఆదాయం కూడా తీసుకురాలేకపోయామని జీవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎస్​ఎఫ్​ఎల్​లో సంస్కరణలు చేస్తున్నా అధికారులు సహకరించడం లేదని అందుకే ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ఛైర్మన్‌ స్పష్టం చేశారు.

ఏపీ ఫైబర్‌నెట్‌లో ఆర్థిక నష్టం, పరిపాలనలో నిర్లక్ష్యం

సంస్థలో 400 మందిని తొలగించాలని ఆదేశాలిచ్చినా అధికారులు పట్టించుకోలేదని జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల తొలగింపు ఆదేశాలపై ఫైబర్‌నెట్ ఎండీ, ఈడీ సంతకాలు చేయలేదని, ఉద్యోగులకు జీతాల రూపంలో సంస్థ సొమ్ము చెల్లించారని మండిపడ్డారు. ఫైబర్‌నెట్‌లోని ఉన్నతాధికారులు గత ప్రభుత్వంతో చేతులు కలిపారని అన్నారు. ఫైబర్‌నెట్‌కు జీఎస్టీ అధికారులు రూ.377 కోట్లు జరిమానా విధించారని, కానీ అధికారులు తనకు చెప్పలేదని తెలిపారు. ఈ 9 నెలల్లో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయామని, ఇంటర్నెట్ వ్యవస్థలో నిత్యం సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఏపీ ఫైబర్‌నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారుల ఎలా పని చేస్తున్నారనేందుకు ఇవన్నీ నిదర్శనమని జీవీ రెడ్డి అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870