हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Tragedy : తుంగభద్ర లో స్థానానికి దిగి ముగ్గురు మృతి

Sudheer
Tragedy : తుంగభద్ర లో స్థానానికి దిగి ముగ్గురు మృతి

రాయలసీమలోని ప్రముఖ తీర్థక్షేత్రమైన మంత్రాలయం(Mantralayam)లో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు – ప్రమోద్, అజిత్, సచిన్ – రాఘవేంద్ర స్వామి దర్శనార్థం మంత్రాలయకు వచ్చారు. స్వామి దర్శనం అనంతరం తుంగభద్ర నదిలో స్నానం చేయడానికి వెళ్లిన వారు నీటి ప్రవాహానికి గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

గల్లంతైన యువకుల కోసం గాలింపు – మృతదేహాల గుర్తింపు

యువకులు గల్లంతయ్యారని గుర్తించిన వెంటనే స్థానిక సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో రెస్క్యూ బృందం, పోలీసులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. నిర్విరామంగా కొనసాగించిన గాలింపు చర్యల తరువాత అదే ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. వారి మృతదేహాలు బయటకు వెలికితీయబడి పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డాయి.

కుటుంబ సభ్యుల రోదనలు – మంత్రాలయంలో విషాద ఛాయలు

ఇద్దరు మృతుల కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శ్రావణ మాసంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు, అధికారులు అప్రమత్తమవుతున్నారు. భద్రతా చర్యలు మరింత కఠినంగా చేపట్టాల్సిన అవసరం ఉన్నదని పలువురు సూచిస్తున్నారు. మంత్రాలయంలో తుంగభద్ర నదిలో స్నానం చేసే భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also : Floor Painting : కృష్ణ‌మ్మ తీరంలో కుంచెతో కోటి భావాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870