हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pakistan Azerbaijan Turkey: భారత్‌కు ముప్పుగా మారిన “త్రీ బ్రదర్స్” కూటమి

Shobha Rani
Pakistan Azerbaijan Turkey: భారత్‌కు ముప్పుగా మారిన “త్రీ బ్రదర్స్” కూటమి

భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్, టర్కీ, అజర్‌బైజాన్ (Pakistan Azerbaijan Turkey) కలిసి ఏర్పరచుకున్న అనధికారిక సైనిక-రాజకీయ కూటమి ఇది. మూడు దేశాలు ఇస్లామిక్ బ్యాక్‌గ్రౌండ్, సైనిక సహకారం, కాశ్మీర్‌పై ఉమ్మడి వైఖరి వంటి అంశాల్లో ఏకతాటిపై ఉన్నాయి. భారతదేశం ఒక కొత్త ప్రమాదకరమైన ముప్పును ఎదుర్కొంటోంది. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సరికొత్త ముప్పు బహిర్గతమైంది. ఆ ముప్పు పేరే “త్రీ బ్రదర్స్ అలయన్స్”. దేశ విభజన సమయం నుంచి శత్రు వైఖరితో ఉన్న పాకిస్తాన్ అందులో ఒకటి. పాక్ వైఖరి తెలుసు కాబట్టి ఆ దేశం నుంచి ఎదురయ్యే ముప్పు గురించి కూడా స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఇప్పుడు త్రీ బ్రదర్స్ కూటమిలో పాకిస్తాన్‌కు అండదండలు అందిస్తున్న సోదర దేశాలు టర్కీ, అజర్‌బైజాన్‌తో కొత్త ముప్పు ముంచుకొచ్చింది. అందులో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి NATOలో సభ్యదేశంగా ఉన్న టర్కీ వైఖరే యావద్దేశాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ప్రజలు స్వచ్ఛందంగా ఆ దేశంతో సంబంధాలు తెంచుకుంటుండగా.. భారత ప్రభుత్వం ఆచితూచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పాకిస్తాన్, టర్కీ, అజర్‌బైజాన్‌(Pakistan Azerbaijan Turkey) లు కలిసి భారతదేశాన్ని సవాలు చేయడానికి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి గత నాలుగేళ్లుగా రాజకీయ, ఆర్థిక మరియు సైనిక సంబంధాలను బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తోంది.
త్రీ బ్రదర్స్ అలయన్స్ ప్రభావం – విశ్లేషణ
2021లో అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశంలో పాకిస్తాన్, టర్కీ, అజర్‌బైజాన్ (Pakistan Azerbaijan Turkey) అధినేతలు కలిసి తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలోనే “త్రీ బ్రదర్స్ అలయన్స్” పేరుతో ఒక అనధికారిక కూటమి ఏర్పడింది. ఈ మూడు దేశాల మధ్య చారిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు టర్కిక్ (తురుష్కులు) వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇక ఈ మూడు దేశాలను కలిపే కీలకమైన అంశం మతం. ఈ మూడూ మెజారిటీ ఇస్లామిక్ దేశాలు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగాన్ ఈ కూటమి వెనుక ప్రధాన శక్తిగా ఉన్నారు. టర్కీ ప్రభావాన్ని విస్తరించడానికి, ఎర్డోగాన్ తన దేశంతో సన్నిహిత సంబంధాలు కలిగిన దేశాలతో సహకారాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కూటమి మూడు దేశాలకు పరస్పర ప్రయోజనాలను అందించింది. ఉదాహరణకు, 2020 నాగోర్నో-కరబాఖ్ సంఘర్షణలో అజర్‌బైజాన్‌ దేశానికి టర్కీ సైనిక మద్దతు అందించింది. ఫలితంగా ఆర్మేనియాపై అజర్‌బైజాన్ విజయం సాధించడంలో సహాయపడింది. అదేవిధంగా, 1950ల నుండి పాకిస్తాన్ టర్కీతో సన్నిహిత రక్షణ సంబంధాలను కలిగి ఉంది. దీని ద్వారా క్రూయిజ్ మిస్సైల్స్, డ్రోన్లు, ఇతర ముఖ్యమైన సైనిక సాంకేతికతను పొందింది.

Pakistan Azerbaijan Turkey: భారత్‌కు ముప్పుగా మారిన "త్రీ బ్రదర్స్" కూటమి
Pakistan Azerbaijan Turkey: భారత్‌కు ముప్పుగా మారిన “త్రీ బ్రదర్స్” కూటమి

2021 బాకూ సమావేశం – అలయన్స్ జననం
2021లో ఈ మూడు దేశాలు “త్రీ బ్రదర్స్” సైనిక విన్యాసాన్ని ప్రారంభించాయి. సైనిక సమన్వయాన్ని మెరుగుపరచుకున్నాయి. ఈ కూటమి దేశాలు ఒకరి ప్రాదేశిక వివాదాలలో మరొకరికి మద్దతు ఇస్తాయి. అంటే.. కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ విధానానికి టర్కీ, అజర్‌బైజాన్ మద్దతు ఇస్తాయని దానర్థం. టర్కీ ఐక్య రాజ్య సమితి (UN) వంటి వేదికలపై కాశ్మీర్ సమస్యను పదేపదే లేవనెత్తింది. ఇది భారతదేశాన్ని తీవ్రంగా కలవరపరిచింది. పహల్‌గాం ఉగ్రదాడి తర్వాత భారత్ – పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో అజర్‌బైజాన్, టర్కీ రాజకీయంగా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చాయి. భారతదేశంపై దాడుల్లో టర్కీ అందజేసిన డ్రోన్లను పాకిస్తాన్ ఉపయోగించింది. ఇది ఈ కూటమి యొక్క సైనిక సహకార తీవ్రతను సూచిస్తుంది.
ఈ కూటమి ఎందుకు ఆందోళన కలిగిస్తుంది? ఒబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF)కు చెందిన కబీర్ తనేజా మాట్లాడుతూ “ఈ కూటమి చాలా కాలంగా ఉంది. ఇది భారతదేశానికి భౌగోళిక రాజకీయ సమస్యగా మారింది. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఇది భారతదేశానికి పెద్ద సమస్య అని నేను అనుకోను” అని అన్నారు. అయితే టర్కీ, అజర్‌బైజాన్ రెండూ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం లేదని ఆయన సూచించారు. అయినప్పటికీ భారతదేశం ఈ కూటమికి రాజకీయంగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని తనేజా వాదించారు.
భారతదేశ వ్యూహాత్మక ప్రతిస్పందన
ఈ కూటమి విసిరే సవాలును ఎదుర్కోవడానికి భారతదేశం ఇరాన్, ఆర్మేనియాతో సన్నిహితంగా వ్యవహరిస్తోంది. ఆర్మేనియా, అజర్‌బైజాన్‌తో దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలు కలిగి ఉంది. ఇరాన్ కూడా అజర్‌బైజాన్‌తో ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. ఇరాన్‌లో నివసిస్తున్న లక్షలాది అజారీలు అజర్‌బైజాన్‌తో సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నారు. ఆ దేశం ఈ సంబంధాలను ఉపయోగించి విభజన ఉద్యమాలను ప్రోత్సహించవచ్చని ఇరాన్ భయపడుతోంది. భారతదేశం ఆర్మేనియాకు వెపన్ లొకేటింగ్ రాడార్లు, ఆర్టిలరీ సిస్టమ్స్, రాకెట్ లాంచర్లను విక్రయించింది. దీని ద్వారా ఆర్మేనియా సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసింది. గత సంవత్సరం ఆస్ట్రా మిస్సైల్స్ కొనుగోలు ఆర్మేనియా Su30 ఫైటర్ జెట్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి చర్చలు జరిగాయి. ఈ చర్యలు అజర్‌బైజాన్‌ను కలవరపరిచాయి. భారతదేశం ఇప్పటి వరకు సూక్ష్మ దౌత్యం, వ్యూహాత్మక కూటముల ద్వారా “త్రీ బ్రదర్స్” కూటమి పెరుగుదలపై నియంత్రణ చూపిస్తోంది. ఇది పూర్తిగా శత్రుత్వ కూటమిగా మారకముందే సంబంధిత దేశాలతో బాలెన్స్‌డ్ రాజకీయ వైఖరి కొనసాగించాల్సిన అవసరం ఉంది.
Read Also: Nitasha Kaul: యాంటీ-ఇండియా ఆరోపణలపై బ్రిటిష్ ప్రొఫెసర్‌కి OCI రద్దు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870