మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఓ మహిళ గోల్డర్ (Gold) అదృష్టం వరించింది. వజ్రాల గనులకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో మైనింగ్ చేస్తూ ఆమెకు ఒకేసారి ఎనిమిది వజ్రాలు దొరికాయి. వాటిని జిల్లా డైమండ్ కార్యాలయంలో జమ చేయగా, అధికారులు త్వరలో వాటిని వేలం వేయనున్నట్లు వెల్లడించారు. వజ్రాల్లో అతిపెద్దది 0.79 క్యారెట్ల బరువుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అధికారుల అంచనా ప్రకారం.. ఒక్కో వజ్రం (Diamond) మార్కెట్లో రూ.4 నుండి రూ.6 లక్షల వరకు విలువ పలకవచ్చని తెలిపారు. దీంతో ఈ ఎనిమిది వజ్రాల ద్వారా ఆ మహిళకు గణనీయమైన ఆదాయం వచ్చే అవకాశముంది. చిన్న స్థాయి మైనింగ్ ద్వారానే సాధారణ కుటుంబాల జీవితం ఒక్కసారిగా మారిపోయే అవకాశముందని, ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

పన్నా జిల్లా వజ్ర గనులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 8 మీటర్ల మైనింగ్ ప్లాట్ను సంవత్సరానికి కేవలం రూ.200 చొప్పున లీజుకు ఇస్తారు. ఈ తక్కువ ఖర్చుతో లభించే మైనింగ్ లీజులు పేదవారికి పెద్ద ఆశీర్వాదంగా మారుతున్నాయి. వజ్రాల కోసం కష్టపడుతూ ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉండటంతో, పన్నా ప్రజల జీవనోపాధి ఈ గనులపై ఆధారపడి ఉంది. ఈ తాజా సంఘటన మళ్లీ పన్నా వజ్ర గనుల వైభవాన్ని చాటిచెప్పింది.