రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ భారత్ మధ్య మూడో టి20 మ్యాచ్‌

రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ భారత్ మధ్య మూడో టి20 మ్యాచ్‌

రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో ఓడింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 145 పరుగులకే పరిమితమైంది. ఈ ఓటమితో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది.మ్యాచ్ అనంతరం,భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన జట్టు పరాజయంపై స్పందించాడు.ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌ను ఆయన కీలక కారణంగా పేర్కొన్నాడు. “ఆదిల్ రషీద్ తన నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి,తిలక్ వర్మను ఔట్ చేశాడు. అతని అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది,”అని సూర్యకుమార్ అన్నాడు.”రెండో ఇన్నింగ్స్‌లో మంచు ఎక్కువగా ఉంటుందని అనుకున్నాను.

రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ భారత్ మధ్య మూడో టి20 మ్యాచ్‌
రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ భారత్ మధ్య మూడో టి20 మ్యాచ్‌

హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మ్యాచ్ మా చేతుల్లోనే ఉందని భావించాను. అయితే, ఆదిల్ రషీద్ దూకుడుగా ఆడిన తిలక్ వర్మను ఔట్ చేసి, మ్యాచ్‌ను తమ వైపునకి తిప్పాడు. అతను నిజంగా ప్రపంచ స్థాయి బౌలర్. అతనికి క్రెడిట్ దక్కాలి,” అని సూర్యకుమార్ అన్నాడు.భారత బ్యాటింగ్ విషయంలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో, లక్ష్యాన్ని ఛేదించడం కష్టంగా అనిపించిందని,బ్యాటింగ్‌లో మరిన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూర్యకుమార్ చెప్పారు.

“ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం,”అని ఆయన చెప్పారు.ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ, “మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆదిల్ రషీద్ మా జట్టులో అత్యంత కీలక ఆటగాడు. అతని బౌలింగ్ లో వివిధ రకాల టెక్నిక్స్ ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్ కూడా మంచి బౌలర్.అతని ప్రత్యేకత నిలకడగా బౌలింగ్ చేయడంలో ఉంది. రషీద్, మార్క్ వుడ్ ఆఖర్లో విలువైన పరుగులు జోడించడం జట్టుకు మేలు చేసింది,” అని చెప్పారు.”ఇంగ్లండ్ విజయంలో, మా బౌలర్ల నైపుణ్యం, అనుభవం కీలక పాత్ర పోషించింది.

Related Posts
Rahul Dravid: రోహిత్ శర్మ, కోహ్లీలను కలిసిన మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్.. వైరల్ వీడియో ఇదిగో
jammy

భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇటీవల సుదీర్ఘ విరామం తర్వాత జట్టు ప్రధాన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మరియు యువ Read more

Mohammed Shami: భార‌త క్రికెట్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌… మ‌హ్మ‌ద్‌ ష‌మీ వ‌చ్చేస్తున్నాడు
mohammed shami

గత సంవత్సరం వన్డే వరల్డ్ కప్ సమయంలో గాయపడిన భారత పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు పూర్తిగా కోలుకొని ఫిట్‌గా మళ్లీ మైదానంలోకి వచ్చాడు అతని అభిమానులకు Read more

ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ

2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ మరియు ఆస్ట్రేలియా జట్లు ఉత్కంఠ భరిత పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం కొద్ది Read more

పోరాడి ఓడిన యూకీ-ఒలివెట్టి జోడీ
Yuki Bhambri.jpg

బాసెల్ : స్విస్‌ ఇండోర్స్‌ ఓపెన్‌ ఏటీపీ-500 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారతదేశానికి చెందిన యూకీ బాంబ్రీ మరియు ఫ్రాన్స్‌ ఆటగాడు అల్బానో ఒలివెట్టి జోడీ వారి విజయం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *