శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం గర్భగుడిలోకి సంగీత దిగ్గజం ఇళయరాజా ప్రవేశించేందుకు యత్నించారని వచ్చిన వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు. “ఇలాంటి ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. నాపై అవాస్తవాలను ప్రాచుర్యం చేస్తున్నారనే బాధ కలుగుతోంది” అని ఇళయరాజా అన్నారు. ఈ వార్తలు అవాస్తవమైనవి, ప్రజలు వాటిని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇళయరాజా తన ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ తాను ఎప్పుడూ సంప్రదాయాలకు, ఆచారాలకు అనుగుణంగానే ప్రవర్తించానని అన్నారు. గర్భగుడిలో ప్రవేశించాలనే ప్రయత్నం చేశానన్న వార్తలను ఆయన ఖండించారు. అభిమానులు, ప్రజలు ఇలాంటి తప్పుడు వదంతులను పట్టించుకోకుండా ఉండాలి. నా జీవితంలో నమ్మకానికి ఎప్పుడూ అర్ధం ఉంటుంది అని ఆయన ట్వీట్ చేశారు. ఆలయ గర్భగుడి ఘటనపై వచ్చిన వార్తలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఇళయరాజా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సమాజంలో వ్యక్తిగత ప్రతిష్ట, విలువలు కాపాడుకోవడం ముఖ్యమని ఇళయరాజా అభిప్రాయపడ్డారు. “నా గురించి నిజాలు తెలుసుకోవకుండా ఆందోళన చెందవద్దు. నా విలువలను నేను ఎప్పుడూ కాపాడతాను” అని ఆయన స్పష్టంచేశారు. ఈ వివరణతో వివాదానికి తెరపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇక డిసెంబర్ 20 రిలీజ్ కాబోతున్న విడుదల పార్ట్ 2కి ఇళయరాజా సంగీతం సమకూర్చారు. పావురమా పావురమా ఇప్పటికే ఆయన వింటేజ్ స్టైల్ లో సాగి ఛార్ట్ బస్టర్ అయ్యింది. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ నక్సలిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కు వెట్రిమారన్ దర్శకుడు కావడం అంచనాలు పెంచుతోంది.