हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

sumalatha chinthakayala
కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

హైదరాబాద్‌: కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెండ్ చేశారు. పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 5న షాకోజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ సభలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను వివరణ కోరింది. షోకాజ్ నోటీసులపై తీన్మార్ మల్లన్న నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్

షోకాజ్ నోటీసులపై స్పందించని కారణంగా చర్యలు

ఫిబ్రవరి 12 వరకు గడువు ఇచ్చినా, దాదాపు నెల కావస్తున్న షోకాజ్ నోటీసులకు బదులివ్వలేదు. మరోవైపు ప్రభుత్వంపై, కాంగ్రెస్ అధిష్టానంపై, పార్టీలో ముఖ్య నేతలపై విమర్శల దాడిని పెంచడంతో షోకాజ్ నోటీసులపై స్పందించని కారణంగా తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

క్షమాపణ చెప్పాలని డిమాండ్

కాగా, కొన్ని రోజుల క్రితం వరంగల్ లో జరిగిన బీసీల బహిరంగ సభలో కులగణన సర్వే, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా రెడ్డి సామాజిక వర్గంపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపాయి. మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాలని..క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేశారు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870