Theenmar Mallanna suspended from Congress party

కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

హైదరాబాద్‌: కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెండ్ చేశారు. పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 5న షాకోజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ సభలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను వివరణ కోరింది. షోకాజ్ నోటీసులపై తీన్మార్ మల్లన్న నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Advertisements
కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్

షోకాజ్ నోటీసులపై స్పందించని కారణంగా చర్యలు

ఫిబ్రవరి 12 వరకు గడువు ఇచ్చినా, దాదాపు నెల కావస్తున్న షోకాజ్ నోటీసులకు బదులివ్వలేదు. మరోవైపు ప్రభుత్వంపై, కాంగ్రెస్ అధిష్టానంపై, పార్టీలో ముఖ్య నేతలపై విమర్శల దాడిని పెంచడంతో షోకాజ్ నోటీసులపై స్పందించని కారణంగా తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

క్షమాపణ చెప్పాలని డిమాండ్

కాగా, కొన్ని రోజుల క్రితం వరంగల్ లో జరిగిన బీసీల బహిరంగ సభలో కులగణన సర్వే, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా రెడ్డి సామాజిక వర్గంపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపాయి. మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాలని..క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేశారు

Related Posts
ఏపీలో ‘అందరికీ ఇళ్లు’
Housing Scheme

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయం, స్త్రీ సాధికారత లక్ష్యంగా 'అందరికీ ఇళ్లు' పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలను మహిళల పేరుతో Read more

రాజ్యాంగం ఒక్కటే సకల సమస్యలకు పరిష్కారం – డిప్యూటీ సీఎం భట్టి
bhatti br

జాతి అభ్యున్నతికి విద్య ప్రాధాన్యతను బీఆర్ అంబేద్కర్ బోధించారని, అందుకే ఆయన అనేక విశ్వవిద్యాలయాలను స్థాపించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూలో Read more

హైదరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్: ముంబై, బెంగళూరు, చెన్నైతో అనుసంధానం
హైదరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్: ముంబై, బెంగళూరు, చెన్నైతో అనుసంధానం

హైదరాబాద్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కీలకమైన ముందడుగు వేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ల ద్వారా అనుసంధానించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో Read more

CM Chandrababu : నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
CM Chandrababu visit to Srikakulam district today

CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజా సమస్యలను అడిగి సీఎం చంద్రబాబు Read more

Advertisements
×