हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

ట్రైనీ డాక్టర్‌ కేసును విచారించనున్న సుప్రీంకోర్టు

Vanipushpa
ట్రైనీ డాక్టర్‌ కేసును విచారించనున్న సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు నేడు విచారించనున్నది. ఈ కేసులో ఈ నెల 20న కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నిందితుడు సంజయ్‌ రాయ్‌కి జీవిత ఖైదు విధించింది.
నిందితుడికి మరణశిక్ష విధించాలనే డిమాండ్ల మధ్య.. తాజాగా ఈ కేసును సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. ఈ కేసులో దర్యాప్తు ప్రక్రియపై మృతురాలి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం సమీక్షించనున్నారు. దర్యాప్తు సరిగా జరుగలేదని.. తమకు న్యాయం జరిగేలా కేసును మరింత నిశితంగా దర్యాప్తు చేయాలని కోరారు. గతేడాది ఆగస్టు 9న ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలోని సెమినార్‌ హాల్‌లో ట్రైనీ డాక్టర్‌ శవమై కనిపించింది.

సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. సంజయ్‌ రాయ్‌కి జీవిత ఖైదును విధిస్తూ సిల్దా కోర్టు న్యాయమూర్తి అనిర్బన్‌ దాస్‌ తీర్పును వెలువరించారు. అయితే, ఈ కేసు అరుదైన కేసు కిందకు రాదని అభిప్రాయపడ్డారు. కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బెంగాల్‌ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. నిందితుడికి మరణ శిక్ష విధించాలంటూ అప్పీల్‌ చేయగా.. విచారణకు ఆమోదం తెలిపింది. మర వైపు బాధితురాలి తల్లిదండ్రులు కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని స్పష్టం చేసింది. నేరంలో భాగమైన మిగతా వారిని వదిలిపెట్టారని, ఇందులో కుట్ర ఉందని ఆరోపించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870