భూ కక్ష్యలో మానవ నిర్మిత ఉపగ్రహాల సంఖ్య పెరుగుతున్న తీరుతో పాటు, వాటి చుట్టూ తిరుగుతున్న శకలాల ముప్పు కూడా విపరీతంగా పెరుగుతోంది. ప్రయోగించిన ఉపగ్రహాలు, రాకెట్ అవశేషాలు, ఇతర శాస్త్రీయ పరికరాల శకలాలు కక్ష్యలో తిరుగుతూ, ప్రమాదకర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇవి ఒకదాన్ని ఒకటి ఢీకొనడంవల్ల మరిన్ని శకలాలు ఏర్పడి, ముప్పు మరింత పెరిగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
చిన్న శకలమే పెద్ద విధ్వంసానికి కారణం
భూ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాల వేగం గంటకు 28,000 కిలోమీటర్లు దాటుతుంది. ఈ వేగంలో తిరుగుతున్నప్పుడు ఒక సెం.మీ పరిమాణంలో ఉన్న శకలమే ఉపగ్రహాన్ని ఢీకొడితే భారీ నష్టం కలుగుతుంది. ఒక్క ఉపగ్రహం ధ్వంసమైతే, దాని శకలాలు ఇతర శాటిలైట్లను కూడా ఢీకొనడం ద్వారా పెద్ద శృంఖలా విఘాతం చోటు చేసుకోవచ్చు. దీనివల్ల నూతనంగా ప్రయోగించబోయే శాటిలైట్లకూ అంతరాయం ఏర్పడుతుంది.

సాంకేతిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం
ఉపగ్రహాల ద్వారా మనం ఉపయోగించుకుంటున్న నావిగేషన్, కమ్యూనికేషన్, వాతావరణ పర్యవేక్షణ, సైనిక సమాచారం వంటి అనేక వ్యవస్థలు ఒక ఉపగ్రహం ద్వారా జరుగుతున్నాయి. అలాంటి శాటిలైట్ల ధ్వంసం వల్ల ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, డిజిటల్ ప్రపంచాన్ని ఆధారంగా చేసుకున్న జీవన విధానం సైతం గందరగోళానికి గురవుతుంది.
సురక్షితమైన భవిష్యత్కు అంతర్జాతీయ చట్టాలు అవసరం
ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య సమన్వయం అవసరం. భూ కక్ష్యలోని వ్యర్థాలను శాస్త్రీయంగా తొలగించే సాంకేతికతను అభివృద్ధి చేయడంతో పాటు, కొత్తగా ప్రయోగించే ఉపగ్రహాలకు నియంత్రణ విధించే అంతర్జాతీయ చట్టాలు అవసరమవుతున్నాయి. అప్పుడే భవిష్యత్లో మన సాంకేతిక వనరులను రక్షించుకోవచ్చు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ విషయంలో ప్రభుత్వాల మద్దతును కోరుతున్నారు.