గోవాలో (In Goa) ఓ వివాదాస్పద సంఘటన కలకలం రేపింది. ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె (Minister Vishwajit Rane) ఆగ్రహానికి గురైన ప్రభుత్వ డాక్టర్ రుద్రేశ్ చివరకు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం ప్రమోద్ సావంత్ జోక్యంతో ఆయనపై సస్పెన్షన్ ముప్పు తొలగిపోయింది.ఈ వ్యవహారంపై గోవా సీఎం ఆదివారం స్పష్టమైన ప్రకటన చేశారు. “డాక్టర్ రుద్రేశ్ కుట్టికార్ను సస్పెండ్ చేయబోమని గోవా ప్రజలకు భరోసా ఇస్తున్నాను,” అని ట్వీట్ చేశారు. వైద్య సేవలు అత్యంత ప్రమాణాలతో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఆసుపత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీ
గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా ఉన్న డాక్టర్ రుద్రేశ్పై ఓ ఫిర్యాదు వచ్చింది. ఓ వైద్యుడు పేషెంట్లకు అందుబాటులో లేరన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి రాణె స్వయంగా ఆసుపత్రికి వచ్చారు.తనిఖీల సమయంలో డాక్టర్ రుద్రేశ్పై మంత్రి తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. “మీరు డాక్టర్ అనే గుర్తు ఉండాలి. పేషెంట్లతో మర్యాదగా ఉండాలి. ప్రవర్తనను నియంత్రించాలి,” అంటూ ఆయన మందలించారు. వెంటనే సూపరింటెండెంట్ను చూస్తూ “ఇతని స్థానంలో మరొకరిని పెట్టండి, సస్పెన్షన్ పై సైన్ చేస్తా” అని ఆదేశించారు.
వైరల్ అయిన వీడియో – పెరిగిన విమర్శలు
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రిపై విమర్శలు ఊపందుకున్నాయి. గోవా పీసీసీ (ministro) అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించింది.వివాదం పెద్దదవుతుండటంతో సీఎం సావంత్ జోక్యం చేసుకున్నారు. డాక్టర్ను సస్పెండ్ చేయబోమని ప్రకటించడం, వైద్య వర్గాల్లో ఊరటను కలిగించింది.
Read Also : Bengaluru : సూట్కేసులో బాలిక మృతదేహం కేసు..రాత్రివేళ బ్యాగ్ మోసిన ఇద్దరు వ్యక్తులు