ఆటో డ్రైవర్ల సంఘం నిరసన.

Read Time:  1 min
ఆటో డ్రైవర్ల సంఘం నిరసన.
FONT SIZE
GET APP

ఆటో డ్రైవర్ల సమస్యలపై ఆటో డ్రైవర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ లేదంటే ప్రభుత్వానికి తమ నిరసన సెగ తప్పదని ఆటో డ్రైవర్ల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ వెంకటేశ్ మాట్లాడుతూ.. ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలతో పాటు 24వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఆటోడ్రైవర్లకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి,అధికారంలోకి వచ్చిన అనంతరం కాంగ్రెస్ సర్కారు వాటిని విస్మరించిందని అన్నారు.ఇంతకు ముందే నాలుగు నెలల క్రితం తాము సమ్మెకు పిలుపునిచ్చామని.. అప్పుడు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇంటికి పిలిపించి చర్చలు జరిపారన్నారు. చర్చలు జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

150280070 yellow and green auto rickshaws in indiya

ఆటో కార్మికులకు నెలకు రూ.12 వేలు ఇస్తామని ఇప్పటికీ ఆ పథకం అమలు చేయలేదని.. వెంటనే ఆ హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న రాష్ట్ర బడ్జెట్ లో ఆటో కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆటో డ్రైవర్ల ఆవేదన

ఆటో డ్రైవర్లు తమ కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోవడం, ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం (మహాలక్ష్మి) కారణంగా ఆదాయ మార్గాలు తగ్గిపోవడం ఆటో డ్రైవర్ల జీవితాల్లో ఆర్థిక భారం పెంచింది.

ప్రధాన డిమాండ్లు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆటో డ్రైవర్ల సంఘం కోరుతోంది.ఆటో కార్మికులకు నెలకు రూ.12,000 ఆర్థిక సహాయం అందించాల్సి ఉందని, ఆ పథకం ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు.రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో ఆటో కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఆదాయాన్ని కోల్పోయి రోడ్డున పడుతున్నారని వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.వెంకటేశ్ తెలియజేసిన వివరాల ప్రకారం, నాలుగు నెలల క్రితం కూడా ఆటో డ్రైవర్ల సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ సమయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చర్చలకు ఆహ్వానించి సమస్యలపై స్పందిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఆ చర్చల అనంతరం నాలుగు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆటో డ్రైవర్ల సంఘం మండిపడుతోంది.

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.