ys sharmila

ఏపీలో మిర్చి రైతుల పరిస్థితి దయనీయం – షర్మిల

ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులు పెట్టుబడి కూడా రాని ధరలకు తమ పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, క్వింటాకు రూ.15,000 నష్టంతో రైతన్నలు విలవిల్లాడిపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని గమనించి, రైతులకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం మరింత బాధ పెడుతోందని ఆమె ఆరోపించారు.

Advertisements
mirchi ap

కౌలు రైతులకు మరింత నష్టం

ప్రభుత్వం మిర్చి రైతులకు రూ.11,000 మద్దతు ధర ఇచ్చినట్లు ప్రకటించడం గప్పాలని, నిజానికి రైతులు ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టి కూడా నష్టపోతున్నారని షర్మిల వివరించారు. కౌలు రైతులకు మరింత నష్టం ఏర్పడుతోందని, కేంద్ర ప్రభుత్వం మిర్చికి కనీస మద్దతు ధరను రూ.26,000గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని వెంటనే అమలు చేయాలని, మిర్చి రైతులకు బోనస్ ప్రకటించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మిర్చి రైతులకే కాదు, టమాటా రైతులకు కూడా తీరని కష్టాలు

ఇక, మిర్చి రైతులకే కాదు, టమాటా రైతులకు కూడా తీరని కష్టాలు వచ్చిపడ్డాయని షర్మిల అన్నారు. మార్కెట్లో టమాటా ధర తగ్గిపోవడంతో రైతులు కనీస పెట్టుబడిని కూడా రాబట్టలేకపోతున్నారని పేర్కొన్నారు. టమాటా కిలోకు రూ.15 ధర ఉన్నా, రైతుకు మూడ్నాలుగు రూపాయలు కూడా రావడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే టమాటా రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ధరల నియంత్రణ కోసం తగిన చర్యలు అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

Related Posts
ఎన్ని కోర్టుల్లోనైనా పోరాటం చేస్తా: కేటీఆర్‌
BRS Working President KTR Press Meet

హైదరాబాద్‌: విధ్వంసం, మోసం, అటెన్ష్ డైవర్షన్‌ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తన కేసుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందన్నారు కేటీఆర్. కక్ష పూరితంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా తనను Read more

ప్రధాని మోదీ బ్రెజిల్‌లో G20 సదస్సులో పాల్గొనడానికి చేరుకున్నారు..
modi in brazil

భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్‌లోని రియో డి జనీరోకు చేరుకున్నారు. ఈ రోజు, నవంబర్ 18, 2024, G20 సదస్సులో పాల్గొనడం కోసం మోదీ బ్రెజిల్ Read more

ఇప్పట్లో తల్లికి వందనం లేనట్టేనా!
talliki vandanam

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తల్లికి వందనం పథకం అమలు ఇప్పట్లో లేదని తెలుస్తున్నది. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కారణం.. తల్లికి వందనం Read more

ఎన్నికల ఫలితాలు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బే: ఆతిశీ
Small relief for AAP.. CM Atishi's win

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం 22 స్థానాల్లో మాత్రమే Read more

×