ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించిన కమిషన్

ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించిన కమిషన్

తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) రిజర్వేషన్లను సమర్థంగా అమలు చేయాలనే ఉద్దేశంతో, వాటిని మూడు ఉప వర్గాలుగా విభజించాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్ సిఫార్సు చేసింది. మంగళవారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నివేదికను సమర్పించారు. 59 ఎస్సీ వర్గాలను మూడు గ్రూపులుగా విభజించారు:

  • గ్రూప్ I: అత్యంత వెనుకబడిన 15 ఎస్సీ కులాలు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 3.288%. వీరికి 1% రిజర్వేషన్ సిఫారసు.
  • గ్రూప్ II: మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఎస్సీ కులాలు. వీరి జనాభా 62.74%. వీరికి 9% రిజర్వేషన్ సిఫారసు.
  • గ్రూప్ III: రిజర్వేషన్ల ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందిన 26 ఎస్సీ కులాలు. వీరి జనాభా 33.963%. వీరికి 5% రిజర్వేషన్ సిఫారసు.

మాదిగ సామాజిక వర్గం నేత మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీల ఉప వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా ఉద్యమం కొనసాగుతోంది. మాదిగలు గ్రూప్ IIలో ఉండగా, మాలలు గ్రూప్ IIIలో చేర్చబడ్డారు. మాదిగల జనాభా 61.967%, మాలల జనాభా 29.265% గా ఉంది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో ఎస్సీ సబ్ కేటగిరీపై వాయిదా తీర్మానం ఇచ్చినందుకు అసెంబ్లీ నుంచి బహిష్కరించారని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు దీనిని అమలు చేయడం సంతృప్తికరంగా ఉందన్నారు.

2024 సెప్టెంబర్ 12న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం, 2024 అక్టోబర్‌లో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చివరగా, 2025 ఫిబ్రవరిలో ఈ కమిషన్ తన నివేదికను అసెంబ్లీలో సమర్పించగా, కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ, దాన్ని అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని సీఎం ప్రకటించారు.

Related Posts
అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ..?
amaravati ESI

అమరావతిలో 500 పడకల ESI ఆస్పత్రి మరియు 150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లోని Read more

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ప్రారంభమైన నామినేషన్లు..!
Nominations have started for the election of the GHMC Standing Committee.

జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారి వద్ద నాలుగు నామినేషన్లు దాఖలు హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు కార్పొరేటర్ల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారి Read more

ట్రైడెంట్ గ్రూప్ కర్మయోగి రిక్రూట్ మెంట్ డ్రైవ్‌
Trident Group Karmayogi Recruitment Drive

ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌తో.. సమాజంలో ఉన్న కమ్యూనిటీలపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడం, అదే విధంగా వికసిత్ భారత్ వైపు అడుగులు వేయడం పట్ల తన అంకితభావాన్ని Read more

మావోయిస్టులు దగ్ధం చేసిన కారు ఘటనలో ట్విస్ట్
Maoists mischief in Chintoo

చింతూరు మండలం సర్వేల గ్రామం సమీపంలో మావోయిస్టు మంగళవారం తెల్లవారుజామున కారును దగ్ధం చేశారు. అయితే కారులో ఉన్న వ్యక్తులను మావోయిస్టులు అవహరించారా? లేక భయంతో పారిపోయారా? Read more