trump

బానిసలకే ఆ ఆఫర్.. తేల్చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే జన్మతః పౌరసత్వం ఇచ్చే విధానాన్ని రద్దుచేసేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దాన్ని సమర్ధించుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ట్రంప్ సర్కార్ తీసుకున్న జన్మతః పౌరసత్వం రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు డెమోక్రాట్లు కోర్టును ఆశ్రయించడంతో దాని అమలు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న ట్రంప్.. అసలు జన్మతః పౌరసత్వం ఎందుకు తన దేశం తీసుకొచ్చిందో వెల్లడించారు. అమెరికాలో బానిసల పిల్లలకు వర్తించేలా గతంలో జన్మతః పౌరసత్వ నిబంధన తీసుకొచ్చినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వారి పిల్లలకు హక్కులు కల్పించాలనే దీన్ని అమల్లోకి తెచ్చారన్నారు. అంతే కానీ ఇతర దేశాల జనం అంతా వచ్చి అమెరికాలో పోగు పడేందుకు కాదని ట్రంప్ స్పష్టం చేశారు. అందుకే తాను జన్మతః పౌరసత్వ నిబంధనను రద్దు చేసినట్లు వెల్లడించారు. దీనిపై ఎంతవరకైనా వెళ్లేందుకు తాను సిద్దమని తేల్చిచెప్పేశారు.

మరోవైపు జన్మతః పౌరసత్వం దుర్వినియోగం అవుతోందని, దీని వల్ల ఇతర దేశాల వారు, అర్హత లేని పిల్లలు పౌరసత్వం పొందుతున్నారని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ చట్టం గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చిందని ట్రంప్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి లేదని తేల్చిచెప్పేశారు. కాబట్టి తన ప్రభుత్వం జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానని, అక్కడ వంద శాతం తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పుటికే ట్రంప్ సర్కార్ పలు దేశాలకు చెందిన వలసవాదుల్ని విమానాల్లో వారి స్వదేశాలకు పంపేస్తోంది. అలాగే స్థానికంగా వీసాల జారీ విషయంలో పలు మార్పులు చేస్తున్నారు. దీని ప్రభావం భారత్ తో పాటు పలు దేశాలపై కనిపిస్తోంది. ఇప్పటికే భారతీయులు అమెరికా నుంచి తిరుగుముఖం పడుతున్నారు. ఇక వీసాల కోసం ఎదురుచూస్తున్న వారి కష్టాలు అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో అమెరికా సుప్రీంకోర్టు జన్మతః పౌరసత్వంపై ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారాయి.

Related Posts
లోక్‌సభ లో జమిలి ఎన్నికల బిల్లు
WhatsApp Image 2024 12 17 at 1.06.13 PM (1)

ఎంతో కాలంగా బీజేపీ పట్టుదలతో జమిలి ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న విషయం తెలిసేందే. ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్లు Read more

బ్యాంకుల ఎన్‌పిఎ నిష్పత్తి 2.6%కు పడిపోయింది
బ్యాంకుల ఎన్ పిఎ నిష్పత్తి 2.6 కు పడిపోయింది

ఆర్బీఐ యొక్క తాజా ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 2024లో మొత్తం అడ్వాన్స్‌లలో 2.6 శాతానికి తగ్గిన వారి స్థూల నిరర్థక ఆస్తులతో (GNPA) భారతదేశ Read more

బడ్జెట్‌ పై నిర్మలమ్మ కసరత్తులు..త్వరలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ
Nirmalamma exercises on the budget.meeting with the finance ministers of the states soon

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలాసీతారామన్‌ భేటి కానున్నట్లు సమాచారం. Read more

రాజకీయాల్లో విజయం: మోదీ సూచనలు
రాజకీయాల్లో విజయం: మోదీ సూచనలు

ప్రధాని నరేంద్ర మోడీ, జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తోతో పాడ్కాస్ట్‌లో ఒక రాజకీయ నాయకుడు విజయవంతం కావడానికి అవసరమైన లక్షణాలను వివరించారు. ఆయన కమ్యూనికేషన్, అంకితభావం మరియు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *