లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 2023లో బాలీవుడ్లో అడుగుపెట్టి షారుక్ ఖాన్తో కలిసి నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసి భారీ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె క్రికెట్ నేపథ్యంలోని లేటెస్ట్ మూవీ టెస్ట్ లో నటిస్తున్నారు.ఈ చిత్రంలో నయనతారతో పాటు మీరా జాస్మిన్, మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. క్రికెట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు సుమన్ కుమార్ కథ అందించగా, ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ వేద, జగమే తంత్రం వంటి సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన శశికాంత్, ఈ సినిమాతో దర్శకుడిగా తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించారు.

టెస్ట్ చిత్ర షూటింగ్ 2024 జనవరిలో ప్రారంభమై ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని వైఎన్ఓటీ స్టూడియోస్ పతాకంపై చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ లేదా మే నెలలో నెట్ఫ్లిక్స్ OTTలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో నటుడు సిద్ధార్థ్ క్రికెటర్గా నటిస్తుండగా, మాధవన్ క్రికెట్ కోచ్ పాత్రలో కనిపించనున్నారు. నయనతార కీలక పాత్ర పోషించగా, శక్తి శ్రీ గోపాలన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం క్రికెట్ నేపథ్యంలో కథనం కొనసాగుతుండటంతో ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టెస్ట్ చిత్రం తర్వాత, నయనతార తెలుగులో టాక్సిక్, మలయాళంలో డియర్ స్టూడెంట్, తమిళంలో మన్నంగ్కట్టి, రక్కై, మూక్కుట్టి అమ్మన్ 2 వంటి అనేక సినిమాలకు సంతకం చేశారు. 2025లో ఆమె టెస్ట్ , టాక్సిక్, డియర్ స్టూడెంట్, రక్కై వంటి నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని టాక్. నిర్మాత శశికాంత్ గతంలో జగమే తంత్రం చిత్రాన్ని నేరుగా OTTలో విడుదల చేయగా, టెస్ట్ కూడా అదే విధంగా నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యే అవకాశం ఉంది. క్రికెట్ నేపథ్య కథ, నయనతార, మాధవన్, సిద్ధార్థ్ వంటి ప్రముఖ నటీనటుల సమిష్టి నటనతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంచనా.