हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

SLBC : రెస్క్యూ అపరేషన్ కు తాత్కాలిక బ్రేక్

Sudheer
SLBC : రెస్క్యూ అపరేషన్ కు తాత్కాలిక బ్రేక్

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదం తర్వాత ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్‌కు 63 రోజుల అనంతరం తాత్కాలికంగా బ్రేక్ వేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యల్లో ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా, మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినప్పటికీ ప్రమాదకర జోన్‌లో ఇంకా పలు అవశేషాలు తొలగించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. గురువారం ఎక్స్‌కవేటర్లు టన్నెల్ బయటకు రావడంతో సహాయక చర్యలు తాత్కాలికంగా ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సాంకేతిక కమిటీ నివేదికతో కీలక నిర్ణయం

శుక్రవారం జలసౌధలో నిర్వహించిన సాంకేతిక కమిటీ సమావేశంలో, టన్నెల్‌లో 13.6 కిలోమీటర్ల ముందుకు వెళ్లడం సురక్షితం కాదని నిపుణులు వెల్లడించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వివిధ శాఖల నుంచి ఉన్నతాధికారులు, జియోలాజికల్, సిస్మాలజీ, భూగర్భ నిపుణులు హాజరయ్యారు. వారి సిఫారసుల మేరకు, సహాయక చర్యలను మూడునెలల పాటు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో మరింత పరిశీలన, భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

భవిష్యత్‌లో చర్యలకు ప్రణాళిక

ముగింపు సమావేశంలో అధికారులు భవిష్యత్తులో సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు వెల్లడించారు. టన్నెల్ లో భద్రతను మరింతగా పెంచేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రమాదంలో గల్లంతైన ఆరుగురి ఆచూకీ కోసం తదుపరి దశలో మరిన్ని జాగ్రత్తలతో, అప్‌డేటెడ్ టెక్నాలజీతో రెస్క్యూ ఆపరేషన్ మళ్లీ ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని అధికారులు హామీ ఇచ్చారు.

Read Also : BRS Silver Jubilee : చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ వేడుక‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870