हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Temples: దేశంలోనే పేరొందిన రామాలయాలు ఇవే..తప్పక దర్శించుకోండి

Sharanya
Temples: దేశంలోనే పేరొందిన రామాలయాలు ఇవే..తప్పక దర్శించుకోండి

శ్రీరాముడు అంటే హిందువులకే కాదు, భారతీయ సంస్కృతి మొత్తానికి ఒక ఆదర్శం. ధర్మాన్ని రక్షించిన రాజధిరాజు, సత్య మార్గంలో నడిచి ప్రజాస్వామ్య పాలనకు ఆద్యుడు. ఈయన పుట్టిన రోజు శ్రీరామనవమి హిందువులకే కాదు, దేశమంతటా అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ. శ్రీరాముడు-సీతాదేవిల వివాహం జరిగిన రోజునే శ్రీరామనవమిగా భావిస్తూ ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. 2024 జనవరి 22వ తేదీ, భారతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. అయోధ్యలో శ్రీరాముడి జన్మభూమిలో దివ్యమైన రామ మందిరం ప్రారంభమైంది. ఈ ఆలయం కోసం హిందువులు 500 ఏళ్లుగా పోరాడారు. బాబ్రీ మసీదు వివాదం, న్యాయ పోరాటం, సుప్రీంకోర్టు తీర్పు – ఇవన్నీ ఈ ఆలయ నిర్మాణానికి దారితీశాయి. ఇప్పుడు ఇది కేవలం ఆలయం కాదు భారతీయుల ఐక్యతకు, భక్తికి, దేశభక్తికి ప్రతీకగా నిలిచింది.

భారతదేశంలో ప్రసిద్ధ రామాలయాలు

అయోధ్య రామాలయం – ఉత్తర్‌ప్రదేశ్

శ్రీరాముని జన్మస్థలం, బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠ. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ద్వారా సులభంగా చేరవచ్చు. 2024లో ప్రారంభమైన ఆలయం – భక్తుల కల నెరవేరిన స్థలం. శ్రీ రాముని జన్మస్థలమైన అయోధ్యలో ఈ బాలరాముడి దేవాలయం ఉండటంతో తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతాల్లో ఇది ఉంది.

భద్రాచలం సీతారామ ఆలయం – తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గోదావరి తీరంలో భక్త రామదాసు నిర్మించిన ఆలయం, దక్షిణ అయోధ్యగా పిలుస్తారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కొలువై ఉన్నారు. స్థల పురాణం ప్రకారం, భద్రుడు అనే భక్తుడి తపస్సుకు మెచ్చి శ్రీరాముడు ఇక్కడ వెలిశాడని చెబుతారు. 17వ శతాబ్దంలో భక్త రామదాసు (కంచెర్ల గోపన్న) ఈ భద్రాచలం ఆలయాన్ని నిర్మించారు.

ఒంటిమిట్ట కోదండరామ ఆలయం – ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా. సీతారామ కల్యాణోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇక్కడే నిర్వహణ. విజయనగర శిల్పకళకి నిదర్శనం.

కాలారామ మందిరం – నాసిక్, మహారాష్ట్ర

రాముడు వనవాసంలో నివసించిన ప్రాంతంలో నిర్మితమైన ఆలయం. నాసిక్ నగరంలో పర్యాటకంగా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం.

రామ తీర్థ దేవాలయం – పంజాబ్

అమృత్‌సర్ సమీపంలో. రామాయణ కాలానికి చెందినదిగా భావించబడుతుంది. గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ద్వారా చేరుకోవచ్చు.

రామనాథస్వామి ఆలయం – రామేశ్వరం, తమిళనాడు

శివుని జ్యోతిర్లింగం, శ్రీరాముడి ముద్రలతో కలిసి ఉన్న ఆలయం. శ్రీరాముడు లంక యాత్రకు ముందు శివునికి పూజ చేసిన స్థలం.

రామాలయం – భువనేశ్వర్, ఒడిశా

సీత, రామ, లక్ష్మణ విగ్రహాలతో ప్రాచీన నిర్మాణశైలి. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో. ఈ రామాలయాలు కేవలం పూజ స్థలాలు కాదు మన సంస్కృతి, భక్తి, చరిత్ర, భారతీయ విలువలు వీటిలో ప్రతిఫలిస్తాయి. ఈ ఆలయాలను సందర్శించడం వల్ల మనలోని ధర్మసంస్కారాలు బలపడతాయి. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున ఈ ఆలయాల సందర్శన వల్ల జీవన మార్గాన్ని శుద్ధం చేసుకునే అవకాశముంటుంది.

Read also: Ayodhya : రేపు అయోధ్యలో అద్భుత ఘట్టం.. రామయ్య నుదుటిపై సూర్య తిలకం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870