శ్రీరాముడు అంటే హిందువులకే కాదు, భారతీయ సంస్కృతి మొత్తానికి ఒక ఆదర్శం. ధర్మాన్ని రక్షించిన రాజధిరాజు, సత్య మార్గంలో నడిచి ప్రజాస్వామ్య పాలనకు ఆద్యుడు. ఈయన పుట్టిన రోజు శ్రీరామనవమి హిందువులకే కాదు, దేశమంతటా అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ. శ్రీరాముడు-సీతాదేవిల వివాహం జరిగిన రోజునే శ్రీరామనవమిగా భావిస్తూ ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. 2024 జనవరి 22వ తేదీ, భారతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. అయోధ్యలో శ్రీరాముడి జన్మభూమిలో దివ్యమైన రామ మందిరం ప్రారంభమైంది. ఈ ఆలయం కోసం హిందువులు 500 ఏళ్లుగా పోరాడారు. బాబ్రీ మసీదు వివాదం, న్యాయ పోరాటం, సుప్రీంకోర్టు తీర్పు – ఇవన్నీ ఈ ఆలయ నిర్మాణానికి దారితీశాయి. ఇప్పుడు ఇది కేవలం ఆలయం కాదు భారతీయుల ఐక్యతకు, భక్తికి, దేశభక్తికి ప్రతీకగా నిలిచింది.
భారతదేశంలో ప్రసిద్ధ రామాలయాలు
అయోధ్య రామాలయం – ఉత్తర్ప్రదేశ్
శ్రీరాముని జన్మస్థలం, బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠ. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ద్వారా సులభంగా చేరవచ్చు. 2024లో ప్రారంభమైన ఆలయం – భక్తుల కల నెరవేరిన స్థలం. శ్రీ రాముని జన్మస్థలమైన అయోధ్యలో ఈ బాలరాముడి దేవాలయం ఉండటంతో తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతాల్లో ఇది ఉంది.

భద్రాచలం సీతారామ ఆలయం – తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గోదావరి తీరంలో భక్త రామదాసు నిర్మించిన ఆలయం, దక్షిణ అయోధ్యగా పిలుస్తారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కొలువై ఉన్నారు. స్థల పురాణం ప్రకారం, భద్రుడు అనే భక్తుడి తపస్సుకు మెచ్చి శ్రీరాముడు ఇక్కడ వెలిశాడని చెబుతారు. 17వ శతాబ్దంలో భక్త రామదాసు (కంచెర్ల గోపన్న) ఈ భద్రాచలం ఆలయాన్ని నిర్మించారు.
ఒంటిమిట్ట కోదండరామ ఆలయం – ఆంధ్రప్రదేశ్
కడప జిల్లా. సీతారామ కల్యాణోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇక్కడే నిర్వహణ. విజయనగర శిల్పకళకి నిదర్శనం.
కాలారామ మందిరం – నాసిక్, మహారాష్ట్ర
రాముడు వనవాసంలో నివసించిన ప్రాంతంలో నిర్మితమైన ఆలయం. నాసిక్ నగరంలో పర్యాటకంగా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం.
రామ తీర్థ దేవాలయం – పంజాబ్
అమృత్సర్ సమీపంలో. రామాయణ కాలానికి చెందినదిగా భావించబడుతుంది. గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ద్వారా చేరుకోవచ్చు.

రామనాథస్వామి ఆలయం – రామేశ్వరం, తమిళనాడు
శివుని జ్యోతిర్లింగం, శ్రీరాముడి ముద్రలతో కలిసి ఉన్న ఆలయం. శ్రీరాముడు లంక యాత్రకు ముందు శివునికి పూజ చేసిన స్థలం.
రామాలయం – భువనేశ్వర్, ఒడిశా
సీత, రామ, లక్ష్మణ విగ్రహాలతో ప్రాచీన నిర్మాణశైలి. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సమీపంలో. ఈ రామాలయాలు కేవలం పూజ స్థలాలు కాదు మన సంస్కృతి, భక్తి, చరిత్ర, భారతీయ విలువలు వీటిలో ప్రతిఫలిస్తాయి. ఈ ఆలయాలను సందర్శించడం వల్ల మనలోని ధర్మసంస్కారాలు బలపడతాయి. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున ఈ ఆలయాల సందర్శన వల్ల జీవన మార్గాన్ని శుద్ధం చేసుకునే అవకాశముంటుంది.
Read also: Ayodhya : రేపు అయోధ్యలో అద్భుత ఘట్టం.. రామయ్య నుదుటిపై సూర్య తిలకం