Temple Expo started in Tirupati

తిరుపతిలో ప్రారంభమైన టెంపుల్‌ ఎక్స్‌పో

ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు

తిరుపతి : తిరుపతిలో ఇంటర్నేషనల్‌ టెంపుల్స్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పో ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ పాల్గొన్నారు. ఈ ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు జరగనున్నాయి.

Advertisements
image

వర్క్‌షాపులు, మాస్టర్‌క్లాసులు- టెంపుల్ టాక్స్

ఈ కన్వెన్షన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ హార్దిక అభినందనలు తెలుపుతూ రాసిన లేఖను నిర్వాహకులు చదివి వినిపించారు. దేవాలయాల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను తెలియజేసే ఈ ప్రత్యేక జ్ఞాన పంచన కార్యక్రమంలో నిపుణుల నేతృత్వంలో చర్చలు, ప్రదర్శనలు, వర్క్‌షాపులు, మాస్టర్‌క్లాసులు- టెంపుల్ టాక్స్ జరుగనున్నాయి. టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో తిరుపతిలోని ఆశ కన్వెన్షన్ సెంటర్‌లో అంతర్జాతీయ దేవాలయాల సమావేశ ఎక్స్‌పో కొనసాగనుంది. మూడు రాష్ట్రాల సీఎంలు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, తిరుపతి జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌, టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పునరుత్పాదక ఇంధనం, దేవాలయ పాలన

58 దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాల భక్తి సంస్థల ప్రతినిధులు పలువురు పాల్గొంటారు. ITCX ద్వారా 58 దేశాల్లో 1,581 దేవాలయాలను ఒకే వేదికపై అనుసంధానించడం ఈ కార్యక్రమం ద్వారా చేపట్టనున్నారు. ఈ కన్వెన్షన్‌లో పునరుత్పాదక ఇంధనం, దేవాలయ పాలన, దేవాలయ ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ టెంపుల్ పరిష్కారాలు వంటి అంశాలపై సెమినార్లు నిర్వహిస్తారు.

Related Posts
YS jagan:పొగమంచు తగ్గిన తర్వాత ప్రత్యేక హెలికాఫ్టర్ లో బెంగళూరు బయలుదేరిన వైఎస్ జగన్:
ys jagan

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన కోసం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బెంగళూరుకు బయలుదేరారు గురువారం ఉదయం ఆయన బయలుదేరాల్సి ఉన్నా వాతావరణ పరిస్థితుల కారణంగా Read more

RBI: లక్ష నుండి 2 లక్షల వరకు ఆర్బీఐ అనుమతి
లక్ష నుండి 2 లక్షల వరకు ఆర్బీఐ అనుమతి

మీరు యుపిఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా అయితే ఈ వార్త మీ కోసమే. డిజిటల్ పేమెంట్స్ మరింత సులభం ఇంకా ఉపయోగకరంగా మార్చేందుకు యుపిఐ ట్రాన్సక్షన్స్ సంబంధించి Read more

ఆంధ్రాలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్
women sewing

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ మహిళలు సొంతంగా ఉపాధి పొందేందుకు కుట్టుపని Read more

రేపటినుంచి 4 పథకాలు ప్రారంభం
indiramma

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు.. ఇవీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న ప్రారంభిస్తున్న పథకాలు. ఒకేసారి 4 Read more

×